సుమంత్ అశ్విన్ హీరోగా ప్రొడక్షన్ నెం.3 'ప్రేమ కథా చిత్రం 2' ప్రారంభం

  • IndiaGlitz, [Thursday,May 10 2018]

ప్రేమ కథా చిత్రం, జక్కన్న వంటి బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ తో  ఆర్ పి ఏ క్రియేషన్స్ మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ప్రేమ కథా చిత్రం కు సీక్వెల్ ప్లాన్ చేసింది. ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 3 గా ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా  ప్రేమ కథా చిత్రం 2 సినిమా సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. 'బ్యాక్ టూ ఫియర్' అనేది క్యాప్షన్. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ సాగర్ క్లాప్ కొట్టారు. అమరేందర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. అఖిల్ రెడ్డి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. హరి కిషన్ ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ... ఆర్ పి ఏ క్రెయేషన్స్ బ్యానర్లో వచ్చిన ప్రేమ కథా చిత్రం, జక్కన్న సూపర్ హిట్స్ గా మా సంస్థ కు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రేమ కథా చిత్రం హిలేరియస్ కామెడీ తో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ప్రేమ కథా చిత్రం 2 ప్రారంభించాం. సుమంత్ ఆశ్విన్ హీరోగా నటిస్తున్నారు. హరి కిషన్ ను దర్శకుడు గా పరిచయం చేస్తున్నాం. కామెడీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే కథ ఇది.

మా బ్యానర్ కి మరొక సూపర్ హిట్ చిత్రం గా నిలుస్తుందని నమ్ముతున్నాం. సీనియర్ కెమెరామెన్ సి.రాం ప్రసాద్, ఎడిటర్ ఉద్ధవ్, సంగీతం జెబి డైలాగ్ రైటర్ చంద్ర శేఖర్ లాంటి టెక్నీషియన్స్ మెయిన్ పిల్లర్స్ గా ఈ సినిమా రూపొందిస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు.

More News

'రంగస్థలం' కాంబో రిపీట్ చేస్తుందా?

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

చైతు, మారుతి సినిమా స‌గం పూర్త‌య్యింది

యూత్‌ఫుల్ మూవీస్‌తో విజయాలను అందుకున్న దర్శకుడు మారుతి. 'ఈ రోజుల్లో', 'బస్‌స్టాప్', 'ప్రేమకథా చిత్రమ్', 'కొత్తజంట', 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు' లాంటి సినిమాలతో విజయాలను అందుకుని..

లెజెండ్ సినిమా సమర్పణలో విజయ్ ఆంటోనీ 'కాశి' 

సెన్సిబుల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటూ.. నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొన్న విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం 'కాశి'.

నిర్మాణానంతర‌ ప‌నుల్లో 'దేశంలో దొంగ‌లు ప‌డ్డారు'

ఖ‌యూమ్, త‌నిష్క్ రాజ‌న్, షానీ, పృథ్వీ రాజ్, స‌మీర్, లోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సారా క్రియేష‌న్స్  పై  గౌత‌మ్ రాజ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో

పోస్ట్ ప్రొడక్షన్ దశలో సాగరతీరంలో

లాస్య ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకం పై వైజాగ్ సత్యానంద్ మాస్టర్ గారి శిష్యులైన దిశాంత్, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్ గా సీనియర్ నటులు