సీసాలతో కొట్టడమేంటి.. చంపేస్తారా..? : ప్రకాష్ రాజ్

తెలుగు బిగ్ బాస్-3 విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కొన్నిరోజుల క్రితం పబ్‌లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రిషిక్ రెడ్డి గచ్చిబౌలిలోని పబ్‌లో దాడి చేసిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆ తర్వాత తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే ఇంతవరకూ నిందితుడిని పట్టుకున్నట్లు కానీ.. కఠిన చర్యలు తీసుకున్నట్లు గానీ ఒక్క వార్త కూడా రాలేదు. ఈ క్రమంలో ఏకంగా టాలీవుడ్ విలన్, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగాడు. తాను రాహుల్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

మేమంతా ఉన్నాం..
సోమవారం నాడు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను రాహుల్, ప్రకాశ్ రాజ్ కలిశారు. ఈ మేరకు జరిగిన విషయం అంతా దాస్యంకు నిశితంగా వివరించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ కు ఎవరూ లేరని అనుకోవద్దని... తామంతా ఆయన వెనక ఉన్నామన్నారు. ‘పబ్‌కు వెళ్లడంలో తప్పు లేదు.. కొట్టి చంపేస్తారా?. ఓ వ్యక్తిని పబ్లిక్‌లో సీసాలతో దాడి చేస్తారా.. ఏమిటా ధైర్యం. రాహుల్‌పై దాడిచేయడం తప్పు.. అతడి వెంట మేమంతా ఉన్నాం. జరిగిన గొడవలో రాహుల్ తప్పు లేదు. దాడి చేసిన వారికి శిక్ష పడాల్సిందే. పబ్‌లకు వెళితే సీసాలతో అలా కొట్టడమేంటి..? చంపేస్తారా..? ఆ అహంకారం తప్పు.. ఒకడ్ని పట్టుకుని పది మంది కొడతారా..? ఏంటిది..?’ అని ప్రకాష్ రాజ్ ఆగ్రహంతో ఊగిపోయారు. అంతటితో ఆగని ఆయన.. వినయ్ భాస్కర్‌ను కలవడానికి.. ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. మరీ ముఖ్యంగా కేసు కాంప్రమైజ్ కోసం వినయ్ భాస్కర్‌ను కలవాల్సిన అవసరం లేదన్నారు. రాహుల్ తప్పు చేయనప్పుడు కాంప్రమైజ్ అనే ప్రశ్న అనవసరం అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.

ఫంక్షన్ కోసం మాత్రమే..
కాగా.. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్, రాహుల్ సిప్లి కేవలం సినిమా షూటింగ్ పనిమీదే కలిశారన్నారు. మా మధ్య ఒక సినిమా ఫంక్షన్ మాత్రమే చర్చ జరిగిందన్నారు. రాహుల్ పబ్ గొడవకు తనకు ఎలాంటి సంబంధం లేదని వినయ భాస్కర్ స్పష్టం చేశారు.

More News

పాన్ ఇండియా సినిమా నుండి త‌ప్పుకున్న నాగ్‌!!

బాహుబ‌లి, కె.జి.య‌ఫ్ పార్ట్ 1 త‌ర్వాత ద‌క్షిణాది నుండి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా విడుద‌ల‌వుతున్నాయి.

ఏపీ నుంచి ‘పెద్దల’ సభకు వీళ్లే.. పక్కా వ్యూహంతో జగన్!

ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దల సభకు వెళ్లే అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేసేశారు.

మీ ప‌ని మీరు స‌రిగ్గా చేయండి.. నా ప‌ని న‌న్ను చేసుకోనివ్వండి: రానా

టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటి ముంబైకి మీడియాకు చెందిన ఓ జ‌ర్న‌లిస్ట్‌పై మండిప‌డ్డారు.

అమృతపై బాబాయ్ శ్రవణ్ షాకింగ్ కామెంట్స్

మారుతీరావు ఆత్మహత్యపై తనకు చాలా వరకు బాబాయ్ శ్రవణ్‌పైనే అనుమానాలున్నాయని అమృత మీడియా ముందు వెల్లడించింది.

వైఎస్ జగన్‌తో టిఎస్సార్ భేటీ.. చేరిక ఎప్పుడో..!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ సీనియర్ నేత టి. సుబ్బిరామిరెడ్డి భేటీ అయ్యారు.