మళ్లీ బ్రేక్ ఇస్తున్న ప్రభాస్ ?

  • IndiaGlitz, [Friday,December 08 2017]

తొలి చిత్రం ఈశ్వ‌ర్ నుంచి మిర్చి వ‌ర‌కు.. ప్రతి సంవ‌త్స‌రం కూడా త‌న చిత్రాల‌తో సంద‌డి చేస్తూ వ‌చ్చారు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. అయితే బాహుబ‌లి చిత్రం కోసం ఎక్కువ కాల్షీట్స్ కేటాయించ‌డం వ‌లన.. 2014లో ఒక్క సినిమాతో కూడా సంద‌డి చేయ‌లేదు ప్ర‌భాస్‌. ఆ త‌రువాత మ‌ళ్లీ బాహుబ‌లి 2 కార‌ణంగా.. 2016లోనూ అదే ప‌రిస్థితి వ‌చ్చింది ప్ర‌భాస్‌కి.

బాహుబ‌లి సిరీస్ తెచ్చిన క్రేజ్‌తో ప్ర‌భాస్‌.. ప్ర‌స్తుతం సాహో అనే భారీ బ‌డ్జెట్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతోంది. సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత 2018 వేస‌విలో విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే వి.ఎఫ్‌.ఎక్స్ కార‌ణంగా ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

2019లో సాహో విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంద‌న్న‌దే తాజా వార్త‌. అదే గ‌నుక జ‌రిగితే.. 2018లో కూడా ప్ర‌భాస్ సినిమా లేన‌ట్టే. అంటే.. మ‌రోసారి ప్ర‌భాస్ సినిమా లేని సంవత్సరాన్ని ఆయ‌న అభిమానులు చూడాల్సి ఉంటుంద‌న్న‌మాట‌.

అయితే.. ఓ వ‌ర్గం మాత్రం ఈ సినిమా 2018 దీపావ‌ళికి వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు.

More News

త్రివిక్రమ్ వారి చేతే చెప్పిస్తున్నాడు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో.. కథానాయికల పాత్రలు కేవలం వినోదం కోసం అన్నట్లుగానే ఉంటుంటాయి. ఒక్క నువ్వే నువ్వేలో మినహాయిస్తే.. ప్రతి సినిమాలోనూ ఇదే శైలి కనిపిస్తుంది. ఆయన రాసే ఆ మాటలతో కథానాయికలకు మంచి పేరే వచ్చింది కూడా.

ప్ర‌వీణ్ స‌త్తారు మ‌ల్టీస్టార‌ర్ మూవీ

'చందమామ కథలు' సినిమాతో నేషనల్ అవార్డును గెలుచుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. తాజాగా 'పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ప్రవీణ్. దాదాపు 10 సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న డా.

షూటింగ్ పూర్తి చేసుకున్న'ఏంసీఏ'..డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌

నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నసినిమా 'ఎం.సి.ఎ'. దిల్‌రాజు 'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు భానుమ‌తిగా ప‌రిచ‌య‌మైన సాయిప‌ల్ల‌వి ఎం.సి.ఎలో హీరోయిన్‌గా న‌టించింది.

'అజ్ఞాత‌వాసి` సెకండ్ సింగిల్ డేట్‌, ఆడియో డేట్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడో చిత్రంగా 'అజ్ఞాతవాసి' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటోంది.

శర్వానంద్ సినిమా తప్పుకున్న నిత్యా?

‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలతో నటిగా తానేంటో నిరూపించుకుంది ఈ కేరళకుట్టి.