టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన ప్ర‌భాస్ సినిమా సెట్స్‌

  • IndiaGlitz, [Tuesday,February 11 2020]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న 20వ చిత్ర‌మిది. యువీ క్రియేష‌న్స్‌, గోపీకృష్ణా మూవీస్ బ్యాన‌ర్స్‌పై 'జిల్‌' ఫేమ్ రాధాకృష్ణ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఈ సినిమా కోసం చిత్ర నిర్మాత‌లు అన్న‌పూర్ణ స్టూడియోలో భారీ సెట్స్ వేశారు. వివ‌రాల మేర‌కు ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ ఎక‌రం స్థ‌లంలో ఓ స‌రస్సుని త‌వ్వేశార‌ట‌. అలాగే ట్రెయిన్ సెట్ కూడా వేశార‌ట‌. ఈ రెండు సెట్స్‌లో హీరో, హీరోయిన్‌పై రొమాంటిక్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌.

నిజానికి ముందు ఈ సినిమాను యూర‌ప్‌లోని ప‌లు దేశాల్లో చిత్రీక‌రించాల‌ని అనుకున్నారు. కానీ బాహుబ‌లి హిట్ త‌ర్వాత విడుద‌లైన 'సాహో' ఫలితం నిరాశ ప‌రిచింది. దీంతో ప్రభాస్ కొత్త సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా సెట్స్ వేసి సినిమాను చిత్రీక‌రించాల‌ని అనుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆస్ట్రియా, హంగేరి వంటి దేశాల్లోని ప్రధాన నగరాలను పోలిన సెట్స్ వేసి.., ఆ మిగిలిపోయిన సీక్వెన్సెస్ పూర్తి చేస్తున్నారు. దీని వ‌ల్ల బ‌డ్జెట్‌ను కొంత మేర‌కు కంట్రోల్ చేయ‌వ‌చ్చున‌నేది నిర్మాత‌లు ఆలోచ‌న‌.