ప్ర‌భాస్..దేశానికే డార్లింగ్‌

  • IndiaGlitz, [Saturday,May 05 2018]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని తెలుగుతో పాటు.. హిందీలో కూడా నిర్మిస్తున్నారు. ఇందులో నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడి, టీను ఆనంద్, మురళి శర్మ, అరుణ్ విజయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం గత వారం రోజులుగా దుబాయ్‌లోని అబుదాబిలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాల్లో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న నీల్ నితిన్ ముఖేష్ కూడా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే.. హీరో ప్రభాస్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు నీల్ నితిన్. అందరినీ “డార్లింగ్” అని సంబోధించే ప్రభాస్‌ను ఇప్పుడు దేశానికే “డార్లింగ్” అని నీల్ నితిన్ అభివర్ణిస్తున్నారు. ప్రభాస్‌తో ఎవరైనా కలిసి పనిచేస్తే.. వాళ్ళని వెంటనే తనతో ప్రేమలో పడిపోయేలా చేసేస్తాడని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేసారు. అలాగే.. తను, తన కుటుంబ సభ్యులు ప్రభాస్‌తో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ కూడా చేసారు ఈ యంగ్ విలన్.

More News

'మహానటి' రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న హీరో

మాలీవుడ్ మెగాస్టార్ మమ్మూట్టి న‌ట‌వారసుడిగా మ‌ల‌యాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.

తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం సినీగోయర్స్ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తాం - సెక్రెటరీ రామకృష్ణ

తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించిన వారికి 1970 సంవత్సరం నుంచి ప్రతిష్టాత్మకంగా సినీ గోయర్స్ పేరిట అవార్డులు ఇస్తూ సన్మానిస్తున్న సంగతి తెలిసిందే.

'అమ్మ‌మ్మ‌గారిల్లు' 'చాలా చాలా' లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా

'సమ్మోహనం' ఆ సినిమాకి స్ఫూర్తినా?

యువ కథానాయకుడు సుధీర్ బాబు, బాలీవుడ్ భామ అదితిరావ్ హైదరి జంటగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన‌ చిత్రం ‘సమ్మోహనం’.

భారీ యాక్ష‌న్ సీన్ పూర్తిచేసిన చ‌ర‌ణ్‌

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క‌థానాయ‌కుడిగా యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.