ప్రభాస్ వెయిట్ చేయాల్సిందే....

  • IndiaGlitz, [Wednesday,January 04 2017]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ 'బాహుబ‌లి2' సినిమాతో వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ 'ర‌న్ రాజా ఫేమ్' సుజిత్ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. యు.వి.క్రియేషన్స్ బ్యాన‌ర్‌లో రూపొందనున్న ఈ సినిమాలో ఎమీజాక్స‌న్ పేరును హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌గా శంక‌ర్, ఇషాన్‌, లియో పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నారు.

బాహుబ‌లితో నేష‌న‌ల్ రేంజ్‌లో ప్ర‌భాస్ ఫేమ్‌ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ప్ర‌భాస్ త‌న త‌దుపరి చిత్రాన్ని కూడా ఆ రేంజ్‌లోనే భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు నూట యాబై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమాను తెలుగు, త‌మిళం, హిందీల్లో విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను జ‌న‌వ‌రిలో కానీ, ఫిభ్ర‌వ‌రిలో కానీ విడుద‌ల చేయాల‌నుకున్నారు. తీరా ఇప్పుడు సినిమా మార్చిలో స్టార్ట‌య్యేలానే క‌న‌ప‌డుతుంది. అందుకు కార‌ణం బాహుబ‌లి చిత్రీక‌ర‌ణ ఇంకా పూర్తి కాక‌పోవ‌డ‌మేన‌ట‌. బాహుబ‌లి చిత్రీక‌ర‌ణ త‌ర్వాత ప్ర‌భాస్ ముంబై వెళ్లి త‌న లుక్‌ను పూర్తి స్థాయిలో మార్చేస్తాడ‌ట‌.