విషాదం: ‘రాధే శ్యామ్’‌కు మిక్స్‌డ్ టాక్ .. తట్టుకోలేక ప్రభాస్ అభిమాని ఆత్మహత్య

  • IndiaGlitz, [Monday,March 14 2022]

భారత్‌లో సినీతారలకు వున్న క్రేజ్ సాధారణమైంది కాదు. వారిని దైవంలా ఆరాధిస్తారు అభిమానులు. వాళ్ల ఒంటిపై ఈగ వాలనివ్వరు. ఎవరైనా తమ అభిమాన హీరోని పల్లెత్తు మాటంటే అస్సలు ఊరుకోరు. ఇక వాళ్ల పుట్టినరోజులు, సినిమా విడుదల సందర్భాల్లో జాతర మామూలుగా వుండదు. అన్నదానం, రక్తదానం, సహాయక కార్యక్రమాలు చేస్తూ వుంటారు. అయితే అభిమానుల అత్యుత్సాహం ఒక్కోసారి తారలను చిక్కుల్లో పడేస్తుంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమాని ఒకరు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా శుక్రవారం (మార్చి11న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 వేలకు పైగా స్క్రీన్లలో గ్రాండ్‌గా ఈ మూవీ రిలీజ్ అయింది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించగా.. కృష్ణంరాజు, అలనాటి అందాల తార భాగ్యశ్రీ కీలక పాత్రలు పోషించారు. సాహో తర్వాత మూడేళ్లకు ప్రభాస్‌ సినిమా విడుదల కానుండడంతో అడ్వాన్స్‌ బుకింగ్‌ బాగా జరిగింది. ఇక అంచనాలకు తగ్గట్లే మొదటిరోజే ఈ మూవీ మంచి కలెక్షన్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా రూ.48 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే రాధేశ్యామ్‌‌కు కొన్ని చోట్ల మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్‌ సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వచ్చిందని కర్నూలు తిలక్ నగర్‌కు చెందిన రవితేజ (24) మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న రవి శుక్రవారం రాధేశ్యాం సినిమాకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం రవి ఉరివేసుకున్నాడు. ఊరికి వెళ్లిన తల్లి అతనికి ఫోన్ చేసినా తీయలేదు. దీంతో శనివారం ఉదయం స్నేహితులు ఇంటికొచ్చి ఎంతగా తలుపు తట్టినా స్పందించలేదు. ఈ క్రమంలో తలుపులను బద్ధలుకొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా రవి అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాధేశ్యామ్ బాలేదన్న బాధతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకొన్నట్లు మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More News

టాలీవుడ్‌లో మరో విషాదం.. గేయ రచయిత కందికొండ కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గేయ రచయిత కందికొండ కన్నుమూశారు. ఆయన వయసు 49 సంవత్సరాలు.

సమంతకు బౌన్సర్‌లా మారిన బాలీవుడ్ స్టార్ హీరో.. వీడియో వైరల్

సినీ తారలంటే జనాల్లో వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ హీరోయిన్లంటే యువత మరింత ఉత్సాహం చూపిస్తారు.

హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘‘చోర్ బజార్’’ చిత్రం నుంచి మెలోడీ గా సాగే 'జడ' లిరికల్ సాంగ్ విడుదల

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.

"డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో ఖిలాడి

"డిస్నీ ప్లస్ హాట్ స్టార్" ఆడియన్స్ కోసం ఫామిలీ ప్యాక్ లాంటి ఎంటర్ టైన్మెంట్ తో వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. దాని పేరు "ఖిలాడి". స్ట్రీమింగ్ మొదలైంది.

చిక్కుల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నిర్మాత బెల్లంకొండ సురేష్ ... చీటింగ్ కేసుపెట్టిన ఫైనాన్షియర్

టాలీవుడ్ యువ హీరో బెల్లం కొండ శ్రీనివాస్‌, ఆయ‌న తండ్రి ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌లు చిక్కుల్లో పడ్డారు. వీరిద్దరిపై హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఛీటింగ్ కేసు న‌మోదైంది.