‘సాహో’ రిలీజ్కు ముందే ప్రభాస్ సర్ఫ్రైజ్.. ఫ్యాన్స్ ఫిదా!
- IndiaGlitz, [Tuesday,August 13 2019]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటీనటులుగా సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ‘సాహో’. ఆగస్టు-30న ‘సాహో’ థియేటర్లలోకి వస్తుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా బాహుబలి సక్సెస్తో గేమ్ వచ్చింది కదా.. అదే మాదిరిగానే ఇప్పుడు ‘సాహో’ సినిమా రిలీజ్కు ముందే సర్ఫ్రైజ్ లాగే గేమ్ను విడుదల చేశారు. ఓ వైపు ప్రమోషన్స్.. మరోవైపు యూ ట్యూబ్లో లక్షల్లో వ్యూస్.. ఇంకో వైపు గేమ్తో రెబల్ స్టార్ ప్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ఇప్పటికే గేమ్ తయారు చేస్తున్నట్లు ప్రకటించిన చిత్రబృందం ఎట్టకేలకు సినిమా రిలీజ్కు ముందు సర్ఫ్రైజ్ ఇచ్చేసింది యూనిట్. మంగళవారం నాడు ‘సాహో’ వీడియో గేమ్ టీజర్ను ప్రభాస్ లాంచ్ చేయడం జరిగింది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్రైలర్ను రెబల్ స్టార్ పోస్ట్ చేశారు. కాగా ఈ వీడియో గేమ్లో ప్రభాస్ లీడ్ రోల్లో కనిపిస్తున్నాడు. అయితే ఈ వీడియో గేమ్ టీజర్ లాంచ్ చేసిన కొద్దిసేపటికే ఊహించని రెస్పాన్స్ రావడం సంతోషించదగ్గ విషయమే. ఇదిలా ఉంటే.. ఆగస్టు 15న పూర్తి గేమ్ రిలీజ్ కానుండగా.. ఆగస్టు 30న సాహో థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు.