ప్రభాస్ అతిథిగా...

  • IndiaGlitz, [Sunday,August 13 2017]

బాహుబ‌లితో నేష‌న‌ల్ స్టార్ డ‌మ్ సంపాదించుకున్న హీరో ప్ర‌భాస్‌. ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా 'ఆనందో బ్ర‌హ్మ' సినిమా వేడుక‌కు హాజ‌రు కానున్నార‌ని స‌మాచారం. మ‌హి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌త‌క్వం వ‌హించిన ఈ సినిమా ఆగ‌స్ట్ 18న విడుద‌ల కానుంది.

కామెడీ హార‌ర్ జోన‌ర్‌లో సినిమా రూపొందింది. తాప్సీ స‌హా శ్రీనివాస‌రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, తాగుబోతు ర‌మేష్‌, ష‌క‌ల‌క శంకర్ కీల‌క‌పాత్ర‌ధారులు. సాధార‌ణంగా దెయ్యాలంటే మ‌నుషులు భ‌య‌ప‌డుతూ ఉంటారు. అలాంటిది మ‌నుషులంటే భ‌య‌ప‌డే దెయ్యాన్ని చూస్తే ఎలా ఉంటుంద‌నేదే సినిమా అస‌లు కాన్సెప్ట్‌. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌కి ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా హాజ‌రై యూనిట్‌కు అభినంద‌న‌లు తెలుపుతాడ‌ని అంటున్నారు.