ప్రభాస్ , బన్ని ఒకే బాటలో..

  • IndiaGlitz, [Tuesday,August 08 2017]

అగ్ర క‌థానాయ‌కులు రెబల్ స్టార్ ప్ర‌భాస్‌, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ త‌మ కొత్త చిత్రాల విష‌యంలో ఒకే బాట‌లో వెళ్తున్నారు. ఇంత‌కీ ఆ విష‌య‌మేమిటంటే.. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ త‌రువాత బ‌న్నీ న‌టిస్తున్న చిత్రం నా పేరు సూర్య‌.. ఊరు ఇండియా. ఈ సినిమాకి సంగీతాన్ని బాలీవుడ్ సంగీత ద్వ‌యం విశాల్ శేఖ‌ర్ అందిస్తున్నారు.
ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్‌, స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్‌తో స‌హా ప‌లు హిందీ చిత్రాల‌కు సంగీత‌మందించిన విశాల్ శేఖ‌ర్‌.. తొమ్మిదేళ్ల క్రితం విడుద‌లైన తెలుగు చిత్రం చింత‌కాయ‌ల ర‌వికి హిట్ ట్యూన్స్‌ని అందించారు. మ‌ళ్లీ బ‌న్నీ సినిమాతో ఇక్క‌డివారికి మ‌రోసారి త‌మ బాణీల‌ను వినిపించ‌నున్నారు. ఇక ప్ర‌భాస్ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న సాహో త‌రువాత చేయ‌నున్న రాధాకృష్ణ‌కుమార్ (జిల్ ఫేం) చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించ‌నున్నారు. క్వీన్‌, ఉడ్తా పంజాబ్ త‌దిత‌ర బాలీవుడ్ చిత్రాల‌కు సంగీత‌మందించిన అమిత్ తెలుగులో చేస్తున్న తొలి చిత్ర‌మిదే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుల‌తో ప్ర‌భాస్‌, బ‌న్నీ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఎంత‌మేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.