పవన్ ఫ్యాన్స్‌కు నిరాశ .. భీమ్లా నాయక్ విడుదల వాయిదా, మళ్లీ రిలీజ్ ఎప్పుడంటే..?

  • IndiaGlitz, [Tuesday,December 21 2021]

అనుకున్నదే నిజం అయ్యింది. భీమ్లా నాయక్ రిలీజ్ వాయిదా పడుతుందంటూ జరుగున్న ప్రచారం ఊహాగానాలు కాదు... వాస్తవమే అని తేలింది. పవర్‌స్టార్ పవన్ కల్యాన్- రానా కలిసి నటిస్తోన్న భీమ్లా నాయక్‌ విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ మంగళవారం అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమాను ఫిబ్రవరి 25కి మారుస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ‘‘భీమ్లా నాయ‌క్’’ పోటీ నుంచి తప్పుకుంది. ఈ మేరకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు .. భీమ్లా నాయక్ నిర్మాతలను ఒప్పించినట్లు ఫిలింనగర్ టాక్. అందరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేశారు.

ఈ సినిమాలో పవర్‌స్టార్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్ .. దీనికి యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్‌, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ‘‘భీమ్లా నాయక్’’ను నిర్మిస్తున్నారు. ఇటీవలే వికారాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.

More News

ఈ నెల 25 న థియేటర్లలో సందడి చేయబోతున్న "విక్రమ్"

బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ పతాకంపై నాగవర్మ బైర్రాజు హీరోగా,  దివ్యాసురేశ్ హీరోయిన్ గా, ఇంకా ఆదిత్య ఓం, పృథ్వి రాజ్,

‘‘ఇది పద్దతిగా లేదు ’’.... జూనియర్ ఎన్టీఆర్ ఉగ్రరూపం, ఫ్యాన్స్‌కు వార్నింగ్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తోన్న సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’. సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

ఫ్యాన్స్‌కి హ్యాండిచ్చిన భీమ్లా నాయక్... సంక్రాంతి బరి నుంచి ఔట్..?

వకీల్ సాబ్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘‘భీమ్లా నాయక్’’.. ఆయనతో పాటు యువ హీరో రానా కూడా నటిస్తున్నారు.

రాధేశ్యామ్‌లో కృష్ణంరాజు లుక్ ఇదే .. ప్రశాంతంగా, చేతిలో రుద్రాక్ష మాలతో ‘‘పరమహంస’’గా

బాహుబలి, సాహో తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో

జీవో నెం.35 రద్దు : ఆ కొన్ని థియేటర్లకే కాదు, అందరికీ వర్తింపు ... ఏపీ సర్కార్ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా టికెట్‌ రేట్ల వ్యవహారం గందరగోళానికి గురిచేస్తోన్న సంగతి తెలిసిందే. జీవో నెం 35కి హైకోర్టు రద్దు చేసినా..