ఫైవ్ స్టార్ హోటల్‌లో ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య..

  • IndiaGlitz, [Wednesday,December 09 2020]

ప్రముఖ తమిళ టీవీ నటి వీజే చిత్ర(28) బుదవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెన్నై న‌జ‌ర‌త్ పేట్టైలోని ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌‌లో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె మరణవార్త విని తమిళ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పాండియ‌న్ స్టోర్స్ అనే షోలో ఈమె పోషించిన ముల్లై పాత్ర ద్వారా చాలా క్రేజ్‌ను ద‌క్కించుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు రోజు రాత్రి ఆమె ఈవీపీ ఫిల్మ్‌సిటీలోని ఓ టీవీ సీరియల్ షూటింగ్‌లో పాల్గొన్నారు.

షూటింగ్ అనంతరం వీజే చిత్ర తెల్లవారు జామున 2:30 గంటలకు హోట‌ల్‌ గదికి చేరుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ ఆమె హోటల్ గదిలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. హఠాత్తుగా ఆమె ఆత్మహత్య చేసుకోవడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పాపులర్ టీవీ షో పాండ్యన్ స్టోర్స్‌లో నటించడంతో పాటు పలు టీవీ సీరియల్స్, కొన్ని సినిమాల ద్వారా చిత్ర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వీజే చిత్రకు రీసెంట్‌గా బిజినెస్‌మేన్ హేమంత్‌తో నిశ్చితార్థం జ‌రిగింది. చిత్ర ఆత్మహత్యకు కారణాలైతే ఇప్పటి వరకూ తెలియరాలేదు. వీజే చిత్ర మృతి పట్ల పలువురు తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

More News

వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు..

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను పాత పద్ధతిలో కొనసాగించుకోవచ్చని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.

దీపికకు మరో అరుదైన గుర్తింపు

మన దక్షిణాది అమ్మాయి.. బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకొనెకి అంత‌ర్జాతీయ స్థాయిలో మ‌రో అరుదైన గుర్తింపు ద‌క్కింది.

పవన్ ఎంట్రీతో నిహారిక పెళ్లి వేడుకలో మరింత జోష్...

నిహారికా కొణిదెల, వెంకట చైతన్య జొన్నలగడ్డ వివాహం బుధవారం సాయంత్రం జరగనుంది. అయితే మంగళవారం సాయంత్రం వరకూ ఒక లెక్క..

సంచలనం సృష్టించిన ఏలూరు ఘటనకు కారణం ఇదేనట..

జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఏలూరు ఘటనకు సంబంధించిన మిస్టరీని కొంతమేరకు అధికారులు ఛేదించారు.

'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' ట్రైలర్ విడుదల చేసిన 'జీ 5', గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్

తెలుగు వీక్షకులకు అత్యుత్తమ కంటెంట్ అందిస్తున్న ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5'. తాజాగా మరో ఇంటెన్స్ అండ్ యాక్షన్ డ్రామాను ప్రజల ముందుకు తీసుకొస్తోంది.