న‌రేష్ సినిమాలో పూర్ణ.. అయితే..?

  • IndiaGlitz, [Monday,April 09 2018]

సీమ ట‌పాకాయ్ అనే సినిమాలో అల్ల‌రి న‌రేశ్‌, పూర్ణ జ‌త‌గా న‌టించారు. ఇప్పుడు మ‌రోసారి అల్ల‌రి న‌రేశ్ సినిమాలో పూర్ణ న‌టించ‌నుంది. అయితే ఈసారి హీరోయిన్‌గా పూర్ణ న‌టించ‌డం లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

వివ‌రాల్లోకెళ్తే.. అల్లరి నరేశ్ హీరోగా భీమినేని శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో అల్ల‌రి న‌రేశ్ స్నేహితుడిగా సునీల్ న‌టిస్తున్నాడు. త‌మిళ సినిమాకు ఇది రీమేక్‌గా రూపొందుతోంది.

పూర్ణ కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌నుంది. మ‌రి ఆమె పాత్ర‌కున్న ప్రాధాన్య‌త ఎలాంటిదో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇంత‌కు ముందు న‌రేశ్‌, భీమినేని శ్రీనివాస‌రావు కాంబినేష‌న్‌లో 'సుడిగాడు' సినిమా మంచి విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. 

More News

నాగ‌శౌర్య చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

'ఛలో' విజ‌యం యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. త‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా త‌రువాత త‌దుప‌రి ప్రాజెక్టుల

'కాలా' గురించి 'నా బంగారు తల్లి' ఏమందంటే..

'నా బంగారు తల్లి' సినిమాకుగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న‌ నటి అంజలి పాటిల్. ఆ తర్వాత పలు  హిందీ సినిమాలతో పాటు మరాఠి, ఆంగ్ల చిత్రాల్లోనూ నటిస్తూ వచ్చారు అంజ‌లి.

మెగా హీరోతో మరోసారి

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ త్వరలో ఓ మూవీలో నటించబోతున్న‌ సంగతి తెలిసిందే. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అమెరికాలోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకొంటున్న'సాక్ష్యం'

బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సాక్ష్యం' ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

నా కెరియర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇదే.. ప్రభుదేవా

తన ప్రతి సినిమాతో  విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ లను సొంతం చేసుకుంటున్న కార్తిక్ సుబ్బరాజ్ నిశ్శబ్ధంతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయబోతున్నారు.