దుల్కర్‌తో సినిమా.. భారీ రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసిన పూజా హెగ్డే..

అనతి కాలంలో స్టార్ హీరోయిన్ల జాబితాలో ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో నంబర్ 1 స్థానంలో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే. అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో అనుష్క తర్వాత అత్యంత రెమ్యునరేషన్ పొందుతున్న హీరోయిన్ కూడా పూజాయే కావడం విశేషం. వరుస సినిమాలు.. అందునా ఆమె చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అమ్మడికి విపరీతంగా క్రేజ్ పెరిగింది. దీంతో రెమ్యునరేషన్ కూడా భారీగానే పెరిగింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన ఛాన్స్ కొట్టేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో దుల్కర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను ‘మహానటి’ ప్రొడ్యూసర్స్ తెరకెక్కిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ పిరియాడిక్ లవ్ స్టోరీలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగా.. ఒక పాత్రకు పూజా ఇప్పటికే సైన్ చేసేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం పూజా డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఈ సినిమా కోసం పూజా హెగ్డే.. 2.50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసినట్టు సమాచారం. అయితే ప్రొడ్యూసర్లు స్వప్న దత్, ప్రియాంక దత్‌లు రెమ్యునరేషన్‌ను కాస్త తగ్గించుకునేలా పూజాను కన్విన్స్ చేసి ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించారని టాక్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరో కథానాయిక పాత్రలో స్టార్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది. అయితే ఆమెకు సంబంధించిన వివరాలైతే తెలియరాలేదు.

More News

చివరి గంటే కీలకం..

జీహెచ్ఎంసీ పోలింగ్ మొత్తం ఆసక్తికరంగా సాగింది. దాదాపు ఏ ఎన్నికల్లో అయినా 12 గంటల లోపు ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుంది.

టైటిల్ విషయంలో క్రిష్ క్లారిటీకి వచ్చేశాడా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పీరియాడిక్ మూవీ స్టార్ట్ చేసిన జాగ‌ర్ల‌మూడి క్రిష్‌కు క‌రోనా వైర‌స్ పెద్ద షాకే ఇచ్చింది.

ర‌వితేజ‌కు విల‌న్‌గా మారిన హీరో

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. రీసెంట్‌గానే ‘క్రాక్‌’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ర‌వితేజ‌..

కోవిడ్ ఎఫెక్ట్‌... ‘పుష్ప’ షూటింగ్ క్యాన్సిల్‌

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.

రేస్ టు ఫినాలే.. ఫైనల్ రౌండ్‌లో సొహైల్, అఖిల్..

‘ఖేలో ఖేలో ఖేలోరే.. ’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. సొహైల్‌ని కూర్చోబెట్టి అవినాష్.. మోనాల్ తన్నడం గురించి చెప్పి బాధ పడ్డాడు.