వీడియో గేమ్ డెవ‌ల‌ప‌ర్‌గా పూజా హెగ్డే

  • IndiaGlitz, [Thursday,June 28 2018]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత‌లు సి.అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ డెహ్ర‌డూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జ‌రుగుతోంది. అక్క‌డ మ‌హేష్‌, క‌థానాయిక పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్‌పై కీలక స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో పూజా పాత్ర‌కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే.. ఓ పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప‌నిచేసే వీడియో గేమ్ డెవ‌ల‌ప‌ర్ పాత్ర‌లో పూజ క‌నిపించ‌నుంద‌ట‌. స్టైలిష్‌గా క‌నిపిస్తూనే పెర్‌ఫార్మెన్స్‌తో ఎట్రాక్ట్ చేసే ఈ పాత్ర పూజ కెరీర్‌ను మ‌లుపు తిప్పేలా ఉంటుంద‌ని స‌మాచారం. వ‌చ్చే ఏడాది వేస‌విలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

'ఈ న‌గ‌రానికి ఏమైంది?' వ్య‌వ‌ధి ఎంతంటే..

తొలి చిత్రం 'పెళ్ళి చూపులు' తో క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యాన్ని అందుకోవ‌డ‌మే కాకుండా.. అనేక అవార్డుల‌ను కూడా అందుకున్నారు యువ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్.

నాగ‌చైత‌న్య కాదు.. సుమంత్‌

మ‌హాన‌టుడు, మాజీ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు జీవిత చరిత్ర సినిమాగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న '@నర్తన శాల'

'ఛలో' ఘ‌న‌విజయం యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సొంత నిర్మాణ సంస్థ‌లో చేసిన ఈ చిత్రం భారీ లాభాల‌నే మూట‌గ‌ట్టుకుంది.

చివ‌రి షెడ్యూల్ లో 'ఆయుష్మాన్ భవ' న‌వంబ‌ర్ 9న విడుద‌ల‌

నేను లోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న చిత్రం ఆయ‌ష్మాన్‌భ‌వ‌.

నాచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా 'కురుక్షేత్రం' ట్రైల‌ర్ విడుద‌ల‌

యాక్షన్ హీరో అన‌గానే ట‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు అర్జున్. అందుకే  యాక్ష‌న్ కింగ్ అని అభిమానులు ఇష్టంగా పిలుచుకుంటారు.