మ‌ణిర‌త్నంకు పోటీగా.. ‘పొన్నియ‌న్ సెల్వ‌న్’ వెబ్ సిరీస్‌

ఎందరో తమిళ దర్శక నిర్మాతలు, స్టార్స్ చేయాలని ఆస‌క్తిగా ఎదురు చూసిన చారిత్రాత్మ‌క‌ న‌వ‌ల ‘పొన్నియ‌న్ సెల్వ‌న్‌’ను సినిమాగా తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు. కానీ ఎవ‌రికీ కుద‌ర‌లేదు. ఎట్ట‌కేల‌కు స్టార్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ‘పొన్నియ‌న్ సెల్వ‌న్‌’ సినిమా తెర‌కెక్కుతుంది. విక్ర‌మ్‌, కార్తి, జ‌యంర‌వి, ఐశ్వ‌ర్యారాయ్‌, త్రిష‌, ఐశ్వ‌ర్య‌మీన‌న్ త‌దిత‌రులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే ‘పొన్నియ‌న్ సెల్వ‌న్‌’ వెబ్ సిరీస్‌గా తెర‌కెక్క‌నుంది. అజ‌య్ ప్ర‌తాప్ అనే ద‌ర్శ‌కుడు ఈ వెబ్ సిరీస్‌ను తొమ్మిది సీజ‌న్స్‌లో రూపొందించ‌నున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ వెబ్ సిరీస్‌కు మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్ 14న ఈ సినిమాలో న‌టించ‌బోయే న‌టీన‌టుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని ద‌ర్శ‌కుడు తెలిపాడు. ఆగ‌స్ట్ 18 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తొలి సీజ‌న్‌ను వ‌చ్చే ఏడాది..అంటే 2022 ఏప్రిల్ 14న విడుద‌ల చేస్తామ‌ని ద‌ర్శ‌కుడు అజ‌య్ ప్ర‌తాప్ తెలిపారు. హైద‌రాబాద్‌, చెన్నై, మైసూర్, శ్రీలంక ప్రాంతాల్లో చిత్రీక‌రించ‌నున్నారు.

More News

‘రాధేశ్యామ్‌’ సాంగ్ చిత్రీక‌ర‌ణ లీక్‌...!

రెబల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా?

నేడు వికీపీడియా పుట్టినరోజు.. 20 ఏళ్లలో ఎన్నో మార్పులు..

ఎవరైనా ప్రముఖుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ముందుగా ఏం చేస్తారు? ఆ ప్రముఖుడి పేరును గూగుల్‌‌లో టైప్ చేస్తారు.

అఖిల పని అయిపోయినట్లేనా.. రంగంలోకి మౌనిక!?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కిడ్నాప్ ఉదంతంతో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అడ్డంగా బుక్ అయిపోయారు.

ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఏడుగురి మృతి

ఇండోనేషియాలో భారీ భూకంపం కల్లోలం రేపింది. శుక్రవారం తెల్లవారుజామున సులావేసి దీవుల్లో మజేన్‌ నగర సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.

29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జనవరి 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్నాయి.