Police Son:పోలీస్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. మహిళ మృతి..

  • IndiaGlitz, [Friday,December 01 2023]

అతివేగం అత్యంత ప్రమాదకరం, ప్రాణాంతకం అని పోలీసులు తరుచూ ప్రకటనలు చేస్తూనే ఉంటారు. ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల మీ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని నెత్తి నోరు బాదుకుంటూ ఉంటారు. అయినా కానీ కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. అలాంటిది ఓ పోలీస్ కుమారుడే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఒక్క మహిళ మృతికి కారణమయ్యాడు.

హనుమకొండ జిల్లాలోని దర్గా కాజీపేటకు చెందిన గాదె జోసెఫ్‌, కవిత భార్యాభర్తలు. వీరిద్దరు గురువారం పోలింగ్ సందర్భంగా స్థానిక సెయింట్‌ గాబ్రియేల్‌ పాఠశాలలో ఓటు వేయడానికి బైక్‌పై వచ్చారు. ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్లేందుకు బైక్‌ ఎక్కుతుండగా ఫాతిమానగర్‌ నుంచి దర్గా వైపు ఓ కారు అతి వేగంగా వచ్చి కవితను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

కారు నెంబర్‌ TS 03 FA 9881 ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. అయితే నిందితుడిని ఎక్సైజ్‌ సీఐ కుమారుడు వంశీగా తేల్చారు. మరోవైపు నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మహిళ మృతికి కారణమైన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్‌ చేశారు. కవిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కాజీపేట వంతెన వద్ద శుక్రవారం రాస్తారోకో చేశారు. నిందితుడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పడంతో నిరసన విరమించారు.

More News

Pawan Kalyan:ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇక్కడే పోరాటం చేశా: పవన్ కల్యాణ్‌

జనసేనకు యువతే పెద్ద బలమని.. రాష్ట్రంలో ఆరున్నర లక్షల క్యాడర్‌ ఉందని జనసేనాని పవన్ కల్యాణ్‌ తెలిపారు.

Krishna Board:తక్షణమే సాగర్ నీటి విడుదల ఆపండి.. ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశాలు..

నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి వెంటనే నీటి విడుదల ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది.

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు పచ్చ నేతల నీతులు.. మీరా మాట్లాడేది..?

అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టైన సత్తారు వెంకటేష్ రెడ్డి ఎన్నారై వైసీపీ నేత అంటూ టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది.

KCR :అధికారంపై కేసీఆర్ ధీమా.. డిసెంబర్ 4న కేబినెట్ భేటీకి నిర్ణయం..

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం మంత్రివర్గ సమావేశానికి సిద్ధమయ్యారు రాష్ట్ర సచివాలయంలో కేసీఆర్‌ అధ్యక్షతన డిసెంబర్ 4వ తేదీన

Re Polling:రీపోలింగ్‌కు అవకాశం లేదు.. 70.79శాతం పోలింగ్ నమోదు: సీఈవో

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 70.79% పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు.