Naga Susheela:హీరో నాగార్జున సోదరి నాగ సుశీలపై కేసు.. టాలీవుడ్‌లో కలకలం

  • IndiaGlitz, [Monday,September 18 2023]

హీరో నాగార్జున సోదరి, సుశాంత్ తల్లి అక్కినేని నాగసుశీలపై పోలీస్ కేసు నమోదైంది. ఓ ఆశ్రమంపై దాడి చేశారనే ఆరోపణలతో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుశీలపై కేసు నమోదు చేశారు. శ్రీజ ప్రకృతి దర్శపీఠం ఆశ్రమంపై ఈ నెల 12న నాగసుశీల, ఆమె మనుషులు దాడికి పాల్పడ్డారని ఫిర్యాదుదారుడు ఆరోపణలు చేశారు. దర్శపీఠ నిర్వాహకుడు చింతలపూడి శ్రీనివాసరావుపై వీరు దాడి చేశారని ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని స్వీకరించిన పోలీసులు నాగసుశీలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా.. గతంలోనూ నాగ సుశీలపై ఇలాంటి కేసులు కొత్త కాదు. నాగసుశీల గతంలో తన వ్యాపార భాగస్వామి అయిన చింతలపూడి శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసు పెట్టారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ భూమిని విక్రయించారని ఆరోపిస్తూ నాగసుశీల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భూమిని అమ్మేసి ఆ వచ్చిన నగదు దుర్వినియోగం చేసినట్లు ఆమె ఆరోపించారు. దీనిపై శ్రీనివాస్ స్పందించారు. లాకప్‌లో పెట్టయినా సరే తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకునేందుకు తనపై నాగ సుశీల కేసు పెట్టారని ఆరోపించారు. సుశీల కుమారుడు సుశాంత్ హీరోగా ఇద్దరూ కలిసి సినిమాలు తీశారు. అయితే అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో తీవ్రంగా నష్టపోయామని శ్రీనివాస్ చెప్పారు.

నాగ సుశీల, శ్రీనివాసరావులు శ్రీనాగ్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి పలు సినిమాలు తీశారు. దీనితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేశారు. అయితే ఇద్దరి మధ్యా మనస్పర్ధలు రావడంతో దూరం పెరిగింది. ఇదే సమయంలో ఓ భూ వివాదం కూడా వున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఓ సినిమా కోసం శ్రీనివాసరావు రూ.5 కోట్లు సమకూర్చినట్లు సమాచారం.

More News

Bigg Boss 7 Telugu : షకీలా ఎలిమినేట్.. అమ్మ పాటతో కంటతడి పెట్టించిన దామిని

బిగ్‌బాస్ 7 తెలుగులో సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అంటూ సోషల్ మీడియాలో

Sonia Gandhi :రూ.500కే గ్యాస్ సిలిండర్ , ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ .. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే రైతు, యూత్, దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ..

Asia Cup 2023 : శివాలెత్తిన సిరాజ్.. పేకమేడలా శ్రీలంక టాప్ ఆర్డర్, 8వసారి ఆసియా ఛాంపియన్‌గా భారత్

శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్ 2023ను భారత్ సొంతం చేసుకుని ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది.

Pawan Kalyan:టీడీపీ - జనసేన పొత్తు : సమన్వయ కమిటీ నియమించిన పవన్..  నాదెండ్ల మనోహర్‌కు పగ్గాలు

ఇదిలావుండగా శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Bigg Boss 7 Telugu : సెకండ్ హౌస్‌మేట్‌గా శివాజీ .. రూల్స్‌ ప్రకారం ఆడాలన్న నాగ్, కంటెస్టెంట్స్‌కి రేటింగ్

చూస్తూ వుండగానే బిగ్‌బాస్ 7 తెలుగు సెకండ్ వీకెండ్‌కు వచ్చేసింది. ఉల్టా పల్టా అంటూ సీజన్‌ను రక్తి కట్టించేందుకు బిగ్‌బాస్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.