మెగాస్టార్ మ‌ల్టీస్టార‌ర్.. మ‌రో హీరో ఎవ‌రంటే?

రీ ఎంట్రీ త‌ర్వాత మెగాస్టార్ వ‌రుస సినిమాల‌తో స్పీడు చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘ఆచార్య‌’. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇది పూర్త‌వ‌గానే చిరంజీవి మ‌లయాళ చిత్రం ‘లూసిఫ‌ర్’ రీమేక్‌లో న‌టిస్తున్నారు. ఇది కాకుండా బాబీ, మెహ‌ర్ ర‌మేశ్‌, హ‌రీశ్ శంక‌ర్, సుకుమార్‌ వంటి ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌బోతున్నానని ఓ ఇంట‌ర్వ్యూలో చిరంజీవి తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. అందులో ముఖ్యంగా బాబీ ఆల్రెడీ చిరంజీవిని క‌లిసి క‌థ చెప్పార‌ని కూడా ఆయ‌న చెప్పారు.

తాజాగా సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు బాబీ ఆమ‌ధ్య చిరంజీవిని క‌లిసిన‌ప్పుడు ఓ మ‌ల్టీస్టార‌ర్ క‌థ చెప్పాడ‌ట‌. క‌థ చిరంజీవికి న‌చ్చ‌డంతో ఆయ‌న ఓకే అన్నాడ‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో న‌టించ‌బోయే మ‌రో స్టార్ ఎవ‌రో తెలుసా? రానా ద‌గ్గుబాటి అని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రీ ఎంట్రీలో చ‌ర‌ణ్‌తో మాత్ర‌మే క‌లిసి న‌టించిన చిరంజీవి ఈసారి మ‌రో హీరోతో క‌లిసి నటించ‌బోతున్నాడన్న‌మాట‌. వెంకీమామ వంటి స‌క్సెస్ త‌ర్వాత డైరెక్ట‌ర్ బాబీ డైరెక్ట్ చేయ‌బోయే చిత్ర‌మిదే కానుంది.

More News

ట్రాక్‌ పై నిద్రిస్తున్న 17 మంది మృతి

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్వగ్రామాలకు బయల్దేరిన రైల్వే కూలీలు ట్రాక్‌పై నిద్రిస్తుండగా వారిపై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లింది.

మ‌రో తెలుగులో సినిమాలో విల‌న్‌గా అర‌వింద‌స్వామి..?

అర‌వింద‌స్వామి.. 1980-90 సినిమాల్లో హీరోగా న‌టించి అప్ప‌టి అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా మారిపోయారు. అయితే సినిమా రంగం నుండి ఆయ‌న ఉన్న‌ట్లుండి ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు.

'జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి' సీక్వెల్

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా, శ్రీదేవి హీరోయిన్‌గా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి’. ఈ సోషియో ఫాంట‌సీ చిత్రం విడుద‌లై

మెగా ఫ్యాన్స్ కోరిక నేర‌వేరేనా?

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు రెండు పెద్ద కోరిక‌లు మిగిలిపోయాయి. అవేంటంటే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టించ‌డం, మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోనూ

విశాఖ: ఎల్జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం.. జనం పరుగులు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఇవాళ తెల్లారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని గోపాలపట్నం వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌లో నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున గ్యాస్ లీకయ్యింది.