అజిత్ ‘‘వలిమై’’ థియేటర్‌‌పై పెట్రోల్ బాంబులతో దాడి, ఉద్రిక్తత

తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ సినిమా కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తారు. తాజాగా ఆయన నటించిన ‘వలిమై’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా వున్నాయి. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోని కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు యువ హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హ్యూమా క్యురేషి హీరోయిన్ గా నటించింది.

వలిమై విడుదల నేపథ్యంలో తమిళనాట పండుగ వాతావరణం నెలకొంది. అజిత్ అభిమానులు వూరు వాడా సంబరాలు జరుపుతున్నారు. అయితే కోయంబత్తూరులో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. గంగవల్లి మల్టిప్లెక్స్ థియేటర్ వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా.. బైక్ పై వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబ్‌లతో దాడి చేశారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరూ ఈ సంఘటనలో గాయపడలేదు.

అక్కడే ఉన్న అజిత్ అభిమానులు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేయగా వారు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్స్ వద్ద తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కానీ అభిమానులు మాత్రం వీటిని లెక్కచేయకుండా కటౌట్లు పెట్టడం, పాలాభిషేకాలు చేయడం చేస్తుంటారు. అటు ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన వలిమై చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది.

More News

తగ్గేదే లే.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన పుతిన్, భగ్గుమన్న అమెరికా

పశ్చిమ దేశాలు హెచ్చరిస్తున్నా.. నాటో దళాలు నలువైపులా మోహరించినా ఏమాత్రం తగ్గేదే లే అంటూ యుద్ధానికి సై అన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.

రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ ‘తెలిసిన వాళ్లు’ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన..

రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా సిరింజ్ సినిమా బ్యానర్‌పై వస్తున్న సినిమా తెలిసిన వాళ్లు. ఈ సినిమాను విప్లవ్ కోనేటి తెరకెక్కిస్తున్నారు.

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ : వేదికపై మొగిలయ్యకు సన్మానం.. ఫ్యాన్స్ కోసం మరోసారి పాట

పవర్‌‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాని ‘అంటే సుందరానికి’ నుంచి బర్త్‌డే హోమం వీడియో... రిలీజ్ డేట్ కూడా చెప్పేశారుగా

నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ హిట్‌తో మంచి ఫామ్‌‌లో ఉన్నాడు. దీంతో వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నాడు.

పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘‘భీమ్లా నాయక్’’ ఐదో షోకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 25న పవన్ నటించిన భీమ్లానాయక్‌ విడుదల కానున్న సంగతి తెలిసిందే.