MLC Elections: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రలోభాలు.. స్వతంత్ర అభ్యర్థిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి!

  • IndiaGlitz, [Monday,May 27 2024]

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్లు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. మెుత్తం 12 జిల్లాల్లో 605 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. అయితే నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లిలో పోలింగ్ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్‌‌పై దాడి జరిగినట్లు తెలుస్తోంది.

నార్కట్‌పల్లిలోని డోకూరు ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తరపున డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో స్వతంత్ర అభ్యర్థి అశోక్ అక్కడకు చేరుకున్నారు. దీంతో డబ్బులు పంచటాన్ని అడ్డుకున్నందుకు ఆయనపై దాడి చేసినట్లు చెబుతున్నారు. వీడియో రికార్డు చేస్తున్న మీడియా సిబ్బందిపైనా దాడి చేసి కెమెరాలు, ఫోన్లు ధ్వంసం చేసినట్లు సమాచారం. ఓడిపోతున్నామనే భయంతోనే తనపై దాడి చేసినట్లు అశోక్ ఆరోపించారు.

ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆయన ఆందోళన చేపట్టారు. ప్రలోభాలను అడ్డుకోవటంలో పోలీసులు, ఎన్నికల అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. ఇలాంటి ప్రలోభాలను అడ్డుకుంటున్న వారిపై దాడులు చేయడం అందరూ ఖండించాలని కోరారు.

ఇదిలా ఉంటే ఈ ఘటన మినహా మిగతా పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తుర్కపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తన సతీమణి మమతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఓటేశారు. హనుమకొండ పింగిలి మహిళా కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున తీన్మార్ మల్లన్న పోటీలో ఉండగా.. బీఆర్ఎస్ తరపున ఏనుగు రాకేష్ రెడ్డి, బీజేపీ తరపున గజ్జుల ప్రేమేందర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ కుమార్ పోటీ చేస్తున్నారు. మరి వీరిలో ఎవరిని పట్టభద్రులు అందలం ఎక్కిస్తారో వేచి చూడాలి.

More News

Amit Shah: ఏపీలో కూటమిదే అధికారం.. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన అమిత్ షా

ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ జూన్ 4వ తేదీ జరగనుండగా.. ఫలితాలపై రాజకీయ విశ్లేషకులు, నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

Seethakka: టీపీసీసీ చీఫ్ రేసులో సీతక్క.. సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలించేనా..?

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చొబెట్టింది. ఆయన సారథ్యంలోనే పార్లమెంట్

JD Lakshminarayana: హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడిగించాలి.. జేడీ డిమాండ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఏపీ, తెలంగాణ రాజధానిగా ప్రకటించారు. ఆ పదేళ్ల సమయం ఈ ఏడాది జూన్ రెండో తేదీతో ముగుస్తుంది.

Postal Ballot: ఏపీలో భారీగా నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. ఏ పార్టీకి లాభమో..?

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి పదిరోజులు దాటిపోయింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది.

MLC Elections: తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం.. గెలుపుపై పార్టీల ధీమా..

పార్లమెంట్ ఎన్నికలు ముగిసినా కూడా తెలంగాణలో మాత్రం ఎన్నికల హడావిడి ఇంకా తగ్గలేదు. మే 27(సోమవారం) జరగనున్న ఉమ్మడి నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగిసింది.