CM Jagan:ప్రజలు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం తరపున ఆదుకుంటాం: సీఎం జగన్

  • IndiaGlitz, [Wednesday,December 06 2023]

తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తుఫాన్ బలహీనపడి అల్పపీడనంగా మారిందని.. తుఫాన్ వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు పడ్డాయని గుర్తు చేశారు. అధికారులంతా మీమీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టిపెట్టాలని దిశానిర్దేశం చేశారు.

బాధితులకు అండగా నిలవాలి..

“బాధితుల స్థానంలో మనం ఉంటే.. ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో.. ఆ తరహా సహాయం వారికి అందించాలి. పది రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, వారికి మంచి సహాయం అందాలి. ఇంత కష్టంలో కూడా బాగా చూసుకున్నారనే మాట రావాలి. పరిహారం అందించడం పట్ల సానుభూతితో ఉండండి. దెబ్బతిన్న ఇళ్ల విషయంలో కాని, క్యాంపులనుంచి ప్రజలను తిరిగి వెళ్తున్న సందర్బంలోకాని వారికి ఇవ్వాల్సిన సహాయం వారికి ఇవ్వాలి. రేషన్‌ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదు. పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలి. అన్నిరకాల మానవ వనరులను దీనిపై పెట్టండి. ధ్యాసంతా ఇప్పుడు దీనిపై పెట్టాలి. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. వారు అధైర్యపడాల్సిన పనిలేదు. ప్రతి రైతునూ ఆదుకుంటుంది. పంటల రక్షణ, తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్నిరకాలుగా తోడుగా ఉంటుంది. సబ్సిడీపై విత్తనాల సరఫరాకూ అన్నిరకాలుగా సిద్ధంకావాలి” అని స్పష్టం చేశారు.

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30లక్షల సాయం..

“రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోండి. దీన్నికూడా ప్రాధాన్యతగా తీసుకోండి. వర్షాలు తగ్గుముఖంపట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి. అధికారులంతా బాగానే పనిచేస్తున్నారు. చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్‌ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తాం. విధినిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వాలంటీర్ల దగ్గరనుంచి పై స్థాయి ఉద్యోగుల వరకూ ఈ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది” అని సీఎం జగన్ భరోసా ఇచ్చారు.

More News

Bigg Boss Telugu 7 : యావర్‌కు ఛాన్స్ మిస్, శోభను వరించిన అదృష్టం .. సీరియల్ బ్యాచ్ మధ్య మళ్లీ గొడవలు

బిగ్‌బాస్ సీజన్ 7లో చివరి నామినేషన్స్ సోమవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. అర్జున్ అంబటి తప్పించి మిగిలిన శివాజీ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, అమర్‌దీప్,

Hero Flood: వరద నీటిలో ఇరుక్కుపోయిన హీరో.. సాయం కోసం ఎదురుచూపులు..

మిజాంగ్ తుఫాన్ కారణంగా తమిళనాడు అతలాకుతలమైంది. ముఖ్యంగా చెన్నై నగరం చిగురుటాకులా వణికపోయింది.

Revanth Reddy:బ్రేకింగ్: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి

తెలంగాణ కొత్త సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు.

సీఎం జగన్ ముందుచూపుతో యద్ధప్రాతిపదికన సహాయచర్యలు

తీర ప్రాంతమైన రాష్ట్రం కావడంతో ఏపీలో తుఫాన్ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభిస్తాయో తెలియదు.

Revanth Reddy:తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు..!

తెలంగాణ కొత్త సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందని తెలుస్తోంది. ఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో