close
Choose your channels

ఏం సాధించారని 'పచ్చ' నేతల సంబరాలు.. ఆశ్చర్యపోతున్న ప్రజలు..

Tuesday, November 21, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏం సాధించారని పచ్చ నేతల సంబరాలు.. ఆశ్చర్యపోతున్న ప్రజలు..

ఏదో సాధించినట్లు సంబరాలు.. స్వాత్రంత్య సమరయోధుడు జైలు నుంచి బయటకు వచ్చినట్లు బిల్డప్‌లు.. పచ్చ నేతల హంగామా ఇంతా కాదు. స్కిల్ స్కాం అవినీతి కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 52 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణాలతో మధ్యంత బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబుకు హైకోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. అంతే ఆ పార్టీ శ్రేణులు, ఎల్లో మీడియా చేసిన ఓవర్ యాక్షన్, చూపిన అత్యుత్సాహం ప్రజలను అయోమయానికి గురిచేసింది. ఎల్లోమీడియా పత్రికలూ, ఛానెళ్లలో సైతం ఓవైపు అమాయకుడైన బాబును అరెస్ట్ చేశారు అని రోధిస్తూనే మరోవైపు ఘనంగా బెయిల్ వచ్చింది.. న్యాయం గెలిచింది.. అంటూ ప్రత్యేక కథనాలు ప్రచురించారు.

ఏం సాధించారని పచ్చ నేతల సంబరాలు.. ఆశ్చర్యపోతున్న ప్రజలు..

జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన ఒక నిందితుడిని కీర్తిస్తూ కథనాలు వండి వార్చారు. కొంపదీసి బోలెడు యుద్ధాలు గెలిచి వస్తున్న బాజీరావు వస్తున్నాడా.. కళింగ వరకూ విజయయాత్ర చేసుకుని కృష్ణదేవరాయలు తిరిగి వస్తున్నారా? ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలిచి స్వదేశం వస్తున్న ఆటగాడా ? వరల్డ్ కప్ గెలిచి వస్తున్న మహా క్రీడాకారుడా? దేనికోసం ఎల్లోమీడియా ఆత్రం.. ఏమి చేస్తున్నారో తెలియనంత సోయలేకుండా ఉన్నారా? అవినీతి కేసులో జైలుకెళ్లి బెయిల్ మీద వస్తుంటే అంత సంబరాలు దేనికి? అంటే ఇన్నాళ్లుగా దిక్కూమొక్కూ లేకుండా పడి ఉన్న పార్టీకి ఓ ముసలి దిక్కు లభించిందన్న ఆనందం తప్ప అయన విడుదలతో ప్రజలకు ఏమి ఒరిగిందనే ప్రశ్న తలెత్తుంది. చంద్రబాబు అవినీతి చేయలేదని హైకోర్టు చెప్పలేదు.. అలాగే ఇది రాజకీయ ప్రేరేపిత కేసు కాదని స్పష్టంచేసింది. ఇప్పటికే సీఐడీ కూడా దాదాపు 140 వరకూ ఆధారాలు సేకరించినట్లు కోర్టులో పేర్కొంది. ఇవన్నీ వదిలేసి దండలూ... దండాలూ.. డ్రామాలూ.. అసలు ఏం చేస్తున్నారో ఒంటి మీద స్పృహ ఉందా ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బెయిల్ రాగా దాన్ని సీఐడీ సుప్రీం కోర్టులో సవాల్ చేయనుంది. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ పలు అంశాల్లో హైకోర్టు తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున పిటిషనర్లు వాదించని, కోరని అంశాల్లోకి కూడా న్యాయస్థానం వెళ్లేందుకు ప్రయత్నించిందని.. తన అధికారపరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యనాలు చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. కేసు మెరిట్స్‌ గురించి, ఔచిత్యం గురించి, దర్యాప్తులో లోపాలు గురించి బెయిల్‌ పిటిషన్‌ సమయంలోనే కామెంట్లు చేసిందంటున్నారు. సీఐడీ దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరం ఇష్టానుసారం కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో బెయిల్‌ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలను సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఏం సాధించారని పచ్చ నేతల సంబరాలు.. ఆశ్చర్యపోతున్న ప్రజలు..

స్కిల్‌ స్కాంకు సంబంధించిన డబ్బు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి చేరినట్టుగా కచ్చితమైన ఆధారాలు లేనట్టుగా బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ ఇది తొందరపాటుగా భావిస్తున్నామని సీఐడీ పేర్కొంది. ఇంతేకాకుండా టీడీపీ నుంచి ఎవరూ ఇప్పటివరకూ దర్యాప్తునకు హాజరు కాలేదు సీఐడీ అడిగిన సమాచారం కూడా ఇవ్వలేదు. దర్యాప్తునకు సహకరించడంలేదని కోర్టుకు స్పష్టంగా తెలియజేశామని.. అలాంటపుడు ఆ డబ్బు టీడీపీ ఖాతాకు చేరలేదని ముందే హైకోర్టు ఎలా తేల్చేస్తుందంటూ సీఐడీ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు ఈ కేసులో చంద్రబాబును ఎలా బాధ్యుడ్నిచేస్తారంటూ బెయిల్‌ ఉత్తర్వుల్లో పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నేరం జరగడానికి దారితీసిన పర్యవసానాల్లో ఏ స్థాయిలో ఎవరు పాలుపంచుకున్నా దాన్ని తీవ్రంగానే చూస్తుమని ప్రభుత్వం చెబుతోంది. అలాంటపుడు దర్యాప్తు పూర్తి కాకుండానే చంద్రబాబుకు సంబంధం లేనట్లు కోర్టు వ్యాఖ్యానించడం నిబంధనలకు విరుద్ధం అని ప్రభుత్వం, సీఐడీ అభిప్రాయపడుతూ బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టులో సవాల్ చేయనున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment
Related Videos