ఎన్టీఆర్ సినిమాలో పాట పాడ‌నున్న పెంచ‌ల్ దాస్‌?

  • IndiaGlitz, [Sunday,May 06 2018]

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ పూజా హెగ్డే జంటగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న‌ విషయం విదితమే. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా.. తదుపరి షెడ్యూల్‌ను ఈ నెల 9 నుంచి ప్రారంభించుకోనుంది. ఇదిలా ఉంటే.. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ విలేజ్ బ్యాక్‌డ్రాప్ చిత్రంలో ఎన్టీఆర్ చిత్తూరు యాసలో మాట్లాడనున్నార‌ని తెలిసింది.

ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ గత వైభవం పొందాలని భావిస్తున్న త్రివిక్రమ్.. చిత్తూరు యాసలో డైలాగ్స్‌తో పాటు ఒక పాట కోసం.. ప్రముఖ జానపద గాయకుడు పెంచల్ దాస్ సాయం తీసుకోనున్నారు. తాజాగా నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’లో “దారి చూడు” అనే పాటను రచించి, ఆలపించింది కూడా పెంచల్ దాస్ కావ‌డం గ‌మ‌నార్హం. ఆ పాటతో ప్రేక్షకులని ఎంత‌గానో ఆకట్టుకున్న ఈ గాయకుడు.. ఇప్పుడు త్రివిక్రమ్ కోసం తన కలానికి మ‌రోసారి పని చెప్పనున్నారు. కాగా.. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'హల్ చల్' ఫస్ట్ లుక్ కి విశేషమైన స్పందన

శ్రీరాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రుద్రాక్ష్ ఉత్కమ్-ధన్యబాలకృష్ణ జంటగా

జోరు తగ్గ‌ని 'బాహుబ‌లి 2'

గత సంవత్సరం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించి 1700 కోట్లకుపైగా వసూళ్ళు సాధించింది ‘బాహుబలి 2’.

నాదెండ్లగా సచిన్

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

'సవ్యసాచి' వాయిదా పడుతోందా?

నాగ చైతన్య, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’.

హార్రర్ కామెడీ గా 'వస్తా'

భానుచంద‌ర్‌, జీవా, అదిరే అభి, ఫ‌ణి ప్ర‌ధాన తారాగ‌ణంగా మెట్రో క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొందుతోన్న సినిమా `వ‌స్తా`.