ప‌వ‌న్ కు క‌లిసొచ్చిన క‌మ‌ల్ గాయం..

  • IndiaGlitz, [Tuesday,July 26 2016]

క‌మ‌ల్ హాస‌న్ ఇటీవ‌ల త‌న నివాసంలో మెట్ల పై నుంచి ప‌డిపోవ‌డం...ఆత‌ర్వాత హాస్ప‌ట‌ల్ లో చేరిన విష‌యం తెలిసిందే. క‌మ‌ల్ కాలికి ఆప‌రేష‌న్ చేసారు. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస్ప‌ట‌ల్ లోనే చికిత్స పొందుతున్నారు. ఆప‌రేష‌న్ అనంత‌రం వైద్యులు కనీసం నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని క‌మ‌ల్ హాస‌న్ కి చెప్పారు. దీంతో క‌మ‌ల్ హాస‌న్ - శృతిహాస‌న్ న‌టిస్తున్న శ‌భాష్ నాయుడు చిత్రం షూటింగ్ వాయిదా ప‌డింది. ఈ నెలాఖ‌రు నుంచి షూటింగ్ ప్రారంభించాలి అనుకున్నారు. కానీ..డాక్ట‌ర్స్ నెల రోజులు రెస్ట్ తీసుకోమ‌న‌డంతో సెప్టెంబ‌ర్ నుంచి శ‌భాష్ నాయుడు షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక క‌మ‌ల్ కి గాయం అవ‌డం...ప‌వ‌న్ కు ఎలా క‌లిసొచ్చింది అంటే...డాలీ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే...శృతిని డేట్స్ కోసం సంప్ర‌దించిన‌ప్పుడు ప్రేమ‌మ్, సింగం 3, శ‌భాష్ నాయుడు షూటింగ్స్ లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న ప‌వ‌న్ తో న‌టించాలని ఉన్నా..ఏమీ చేయ‌లేని ప‌రిస్థిత‌. అయితే...క‌మ‌ల్ నెల రోజులు రెస్ట్ తీసుకోవాల్సి రావ‌డంతో ఆ నెల రోజుల డేట్స్ ప‌వ‌న్ మూవీకి కేటాయించింద‌ట‌ శృతి. ఆవిధంగా క‌మ‌ల్ కాలికి గాయం ప‌వ‌న్ కి క‌లిసొచ్చిన‌ట్టు అయ్యింది.