ప్రత్యేక విమానంలో ఉదయ్‌పూర్ వెళ్లిన పవన్..

  • IndiaGlitz, [Wednesday,December 09 2020]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేటి మధ్యాహ్నం రాజస్థాన్‌కు బయల్దేరి వెళ్లారు. మెగా డాటర్ నిహారిక వివాహం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. జొన్నలగడ్డ చైతన్యతో ఆమె వివాహం జరగబోతోంది. వధూవరులతో పాటు ఇరువైపుల పెళ్లిపెద్దలు సోమవారమే రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ హోటల్ వీరి వివాహానికి వేదికైంది. సంగీత్, మెహందీ ఫంక్షన్, పసుపు వేడుక తదితర వేడుకలతో ఉదయ్ విలాస్ సందడిగా మారింది.

ఈ వివాహానికి నేటి ఉదయం వరకూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మినహా మెగా ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్ చేరుకుంది. దీంతో పవన్ కూడా నేటి సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయ్‌పూర్ వెళ్లారు. కాగా.. సంగీత్ వేడుకలో మెగా హీరోలంతా డ్యాన్స్‌లతో ఇరగదీశారు. ఇక నిహారిక, చైతన్యల జంట చిరు పాటలకు స్టెప్పులేసి అలరించినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ సంగీత్‌లో స్టెప్పులేసి అలరించారు. కాగా.. నిహారిక, చైతన్యల వివాహం రేపు సాయంత్రం జరగనుంది.

More News

అరియానా విశ్వరూపం.. టూమచ్

షో స్టార్టింగే.. రూలర్ అయిన అరియానా.. ఒక్కొక్క వస్తువును తీసుకొచ్చి వాటితో తమ అనుబంధాన్ని పంచుకోవాలని చెప్పింది.

తనయుడితో తొలిసారి..

తెలుగు సినీ రంగంలో హీరోగా శ్రీకాంత్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే అంత కంటే ముందే అంటే కెరీర్‌ ప్రారంభంలో శ్రీకాంత్‌ విలన్‌గా కూడా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ కంటే బురదలో పందులు నయం: బీజేపీ ఎంపీ

దళారీలకు సీఎం కేసీఆర్ చీఫ్ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గుడ్ న్యూస్.. రూ.250 కే కరోనా టీకా..

కరోనా టీకా ఎప్పుడొస్తుందో అనే ప్రశ్న కంటే.. ఆ టీకా ధర ఎంత ఉంటుందోనన్న భయమే సామాన్య ప్రజానీకాన్ని పట్టి పీడిస్తోంది. సీరం ఇన్‌స్టిట్యూట్..

నిహారిక వివాహం : రేర్ ఫోటోను షేర్ చేసిన చిరు..

మెగా బ్రదర్‌ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదెల వివాహం మరికొన్ని గంటల్లో వైభవంగా జరగనుంది.