మ‌రోసారి ప‌వ‌న్ తో త్రివిక్ర‌మ్..

  • IndiaGlitz, [Tuesday,December 01 2015]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్...వీరిద్ద‌రు మంచి మిత్రులు అనే విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రు క‌ల‌సి జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు చేసారు. ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ క‌ల‌సి రాయ‌ల‌సీమ నేప‌ధ్యంలో కోబ‌లి అనే మూవీ చేయాల‌నుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ ను ప‌క్క‌న పెట్టారు. అయితే వీరిద్ద‌రు క‌ల‌సి మ‌రో మూవీ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ నితిన్ తో మూవీ చేస్తున్నారు.

ఈ మూవీ త‌ర్వాత త్రివిక్ర‌మ్ త‌మిళ హీరో సూర్య‌తో ఓ మూవీ చేయ‌నున్నారు. సూర్య‌తో సినిమా పూర్త‌యిన త‌ర్వాత ప‌వ‌న్ తో మూవీ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ట త్రివిక్ర‌మ్. మ‌రి..ప‌వ‌న్ తో చేసే మూవీకి త్రివిక్ర‌మ్ ఎలాంటి క‌థాంశాన్ని ఎంచుకుంటాడో చూడాలి.