ఆ రెండింటినీ ఒకేసారి పట్టాలెక్కించనున్న పవన్..

  • IndiaGlitz, [Thursday,December 31 2020]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతోంది. పిరియాడికల్ స్టోరీ ఆధారంగా క్రిష్ ఈ సినిమాను రూపొందించబోతున్నారు. మొఘల్ పరిపాలనా కాలానికి చెందిన ఈ కథలో పవన్ ఓ గజదొంగగా నటించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ ఇప్పటి వరకూ దాదాపు ఇలాంటి పిరియాడికల్ మూవీని చేయలేదనే చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే రాజుల కాలం నాటి సినిమాల్లో పవన్ ఇప్పటి వరకూ నటించలేదు. పైగా ఒక గజదొంగగా పవన్ నటించడం ఇదే తొలిసారి.

కాగా.. ఈ సినిమాకు 'విరూపాక్ష', 'గజదొంగ', 'ఓం శివమ్' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ షూటింగ్ ముగియడంతో... మరో నాలుగు రోజుల్లో పవన్ ఈ సినిమాను లైన్‌లో పెట్టనున్నారని సమాచారం. జనవరి నాలుగో తేదీ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు పవన్ రాబోతున్నారట. హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం ఇప్పటికే చిత్రబృందం భారీ సెట్‌ను వేసిందని సమాచారం. అయితే పవర్ స్టార్.. ఈ సినిమాతో పాటే ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రీకరణను కూడా మొదలుపెట్ట బోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా సాయి పల్లవి నటిస్తుండగా.. మరో ప్రధాన పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు.

More News

జనవరి 1న 'కాళికా' చిత్రం విడుదల

నట్టి ఎంటర్టైన్మెంట్ సమర్పణలో క్వీటీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై రాధికా కుమరస్వామి,సౌరవ్ లోకేష్,శరణ్ ఉల్తి, జి. కె. రెడ్డి,సాదు కోకిల,తబ్లా నాని,అంజనా

తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు.. హైకోర్టు ఫైర్..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. నూతన సంవత్సర వేడుకలను బ్యాన్ చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అనురాగ్ కశ్యప్ రియాలిటీని ఆర్జీవీ ఊహిస్తే ఇలా ఉంటుందా!

ఊహాలకే రెక్కలు వస్తే.. ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది కదా.. రియల్ లైఫ్‌లో డ్యూయెట్లు లేకుండా.. స్టెప్పులు లేకుండా...

అకౌంట్‌లోని డబ్బు ఇలా కూడా లేపేస్తారా?.. నయా మోసం వెలుగులోకి..

డబ్బు కొట్టేయడంలో ఇద్దరు విద్యార్థులు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇద్దరు సీఏ విద్యార్థులు చేసిన పని..

సిద్దార్థ్‌తో డేటింగ్.. కియారా ఓపెన్ అయిపోయింది..!

బాలీవుడ్‌లో కియారా అడ్వాణి.. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. వరుస ఆఫర్లతో కియారా దూసుకుపోతోంది.