close
Choose your channels

Pawan Kalyan:ఢిల్లీలో బిజీబిజీగా జనసేనాని .. అందరినీ కలిసిన తర్వాత మాట్లాడతా : మీడియాతో పవన్ కళ్యాణ్

Tuesday, April 4, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో వరుసగా రెండో రోజు బిజీబిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ మురళీధరన్‌తో పవన్ భేటీ అయ్యారు. ఆయన వెంట జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా వున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే తాను మరికొందరు బీజేపీ పెద్దలను కలవాల్సి వుందని, వారితో భేటీ తర్వాత అన్ని విషయాలు మీడియాకు వెల్లడిస్తానని జనసేనాని పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం బీజేపీ అగ్రనేత , కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ భేటీ అవుతారని సమాచారం. జనసేనతో దూరం పెరిగిందన్న ఏపీ బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీలో పవన్‌కు ఢిల్లీ పెద్దల నుంచి ఖచ్చితమైన రూట్ మ్యాప్ లభించే అవకాశం వుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మచిలీపట్నం సభ తర్వాత సినిమాలకే పరిమితమైన పవన్ :

ఇక జనసేన గురించి వస్తే.. మచిలీపట్నం సభ తర్వాత సినిమాల్లో బిజీ అయిన పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వెళ్లిన పవర్‌స్టార్ అక్కడ సరదాగా గడిపారు. ఆయన వెంట నాదెండ్ల మనోహర్ కూడా వున్నారు. సోమవారం ఉదయ్‌పూర్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న పవన్ కల్యాణ్.. బీజేపీకి చెందిన పలువురు పెద్దలు, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. నిన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పవన్ సమావేశమయ్యారు.

జనసేన తమతో కలిసి రావడం లేదంటోన్న బీజేపీ :

ఇదిలావుండగా.. జనసేన తమతో కలిసి రావడంత లేదని ఏపీ బీజేపీ నేతలు ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. జనసేనతో పొత్తు వున్నా.. లేనట్లుగానే వుందని బీజేపీ నేత మాధవ్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన తమతో కలిసి రాలేదని ఆయన ఆరోపించారు. తమ అభ్యర్ధికి జనసేన మద్ధతు వుందని పీడీఎఫ్ చెప్పుకుంటుంటే.. ఆ విషయాన్ని ఖండించమని కోరినా జనసేన వైపు నుంచి స్పందన లేదని మాధవ్ వ్యాఖ్యానించారు.పొత్తుల విషయంలో అనేక ఆలోచనలు వున్నాయని.. తాము మాత్రం పార్టీ బలోపేతం గురించే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్ధితుల్లో కమల నాథులతో పవన్ ఏం మాట్లాడతారో.. ఆయనకు బీజేపీ నేతలు ఎలాంటి డైరెక్షన్ ఇస్తారో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment