Pawan Kalyan:ఢిల్లీలో బిజీబిజీగా జనసేనాని .. అందరినీ కలిసిన తర్వాత మాట్లాడతా : మీడియాతో పవన్ కళ్యాణ్

  • IndiaGlitz, [Tuesday,April 04 2023]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో వరుసగా రెండో రోజు బిజీబిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ మురళీధరన్‌తో పవన్ భేటీ అయ్యారు. ఆయన వెంట జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా వున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే తాను మరికొందరు బీజేపీ పెద్దలను కలవాల్సి వుందని, వారితో భేటీ తర్వాత అన్ని విషయాలు మీడియాకు వెల్లడిస్తానని జనసేనాని పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం బీజేపీ అగ్రనేత , కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ భేటీ అవుతారని సమాచారం. జనసేనతో దూరం పెరిగిందన్న ఏపీ బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీలో పవన్‌కు ఢిల్లీ పెద్దల నుంచి ఖచ్చితమైన రూట్ మ్యాప్ లభించే అవకాశం వుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మచిలీపట్నం సభ తర్వాత సినిమాలకే పరిమితమైన పవన్ :

ఇక జనసేన గురించి వస్తే.. మచిలీపట్నం సభ తర్వాత సినిమాల్లో బిజీ అయిన పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వెళ్లిన పవర్‌స్టార్ అక్కడ సరదాగా గడిపారు. ఆయన వెంట నాదెండ్ల మనోహర్ కూడా వున్నారు. సోమవారం ఉదయ్‌పూర్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న పవన్ కల్యాణ్.. బీజేపీకి చెందిన పలువురు పెద్దలు, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. నిన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పవన్ సమావేశమయ్యారు.

జనసేన తమతో కలిసి రావడం లేదంటోన్న బీజేపీ :

ఇదిలావుండగా.. జనసేన తమతో కలిసి రావడంత లేదని ఏపీ బీజేపీ నేతలు ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. జనసేనతో పొత్తు వున్నా.. లేనట్లుగానే వుందని బీజేపీ నేత మాధవ్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన తమతో కలిసి రాలేదని ఆయన ఆరోపించారు. తమ అభ్యర్ధికి జనసేన మద్ధతు వుందని పీడీఎఫ్ చెప్పుకుంటుంటే.. ఆ విషయాన్ని ఖండించమని కోరినా జనసేన వైపు నుంచి స్పందన లేదని మాధవ్ వ్యాఖ్యానించారు.పొత్తుల విషయంలో అనేక ఆలోచనలు వున్నాయని.. తాము మాత్రం పార్టీ బలోపేతం గురించే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్ధితుల్లో కమల నాథులతో పవన్ ఏం మాట్లాడతారో.. ఆయనకు బీజేపీ నేతలు ఎలాంటి డైరెక్షన్ ఇస్తారో చూడాలి.

More News

SSC Exams:నిన్న పేపర్ లీక్.. ఈరోజు ఆన్సర్ షీట్ల కట్ట మిస్సింగ్, తెలంగాణలో ఏం జరుగుతోంది..?

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ట కాస్తంత మసకబారింది. ఈ కేసులో రంగంలోకి దిగిన సిట్ ముమ్మరంగా దర్యాప్తు జరుపుతోంది.

Renu Desai:మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు .. ‘‘కొందరు’’ అంటూ రేణూ దేశాయ్ పోస్ట్, వైరల్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రేణూ దేశాయ్.

Mission: Chapter 1:నాలుగు భాష‌ల్లో అరుణ్ విజ‌య్ భారీ చిత్రం ‘మిషన్:  చాప్ట‌ర్ 1’

భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను రూపొందిస్తూ వ‌రుస స‌క్సెస్‌ల‌ను సొంతం చేసుకుంటున్నారు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ అధినేత సుభాస్క‌రన్‌.

Pawan Kalyan:కర్ణాటకలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా పవన్ .. కమలనాథుల వ్యూహం అదేనా..?

దక్షిణాదిలో వున్న పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే.

SBI:మొరాయించిన ఎస్‌బీఐ సర్వర్.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

ఇటీవలి కాలంలో పలు బ్యాంక్‌ల సర్వర్లు మొరాయిస్తూ వుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.