నితిన్‌ని సర్‌ప్రైజ్ చేసిన పవన్..

  • IndiaGlitz, [Saturday,July 25 2020]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు.. ఫంక్షన్లు తదితర వేడుకలకు కాస్త దూరంగానే ఉంటారన్న విషయం తెలిసిందే. అలాంటిది కరోనా సమయంలో.. చాతుర్మాస దీక్షలో ఉన్న ఆయన అభిమాని పెళ్లి కంటే ముందే వెళ్లి సర్‌ప్రైజ్ చేశారు. ఆ అభిమాని ఎవరో కాదు.. హీరో నితిన్. నితిన్, షాలినీల వివాహం ఈ నెల 26న జరగనున్న విషయం తెలిసిందే. దీనికి ముందే నితిన్ పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇటీవలే హైద‌రాబాద్‌లోని నితిన్ నివాసంలో నిశ్చితార్థ వేడుక జరిగింది. అప్పటి నుంచి పెళ్లి హడావుడి ప్రారంభమైంది. కరోనా కారణంగా బంధువులు, అతి కొద్ది మంది సన్నిహితుల నడుమ వివాహం చేసుకోవాలని నితిన్ ఫిక్స్ అయ్యాడు.

అయితే నితిన్‌కి పవన్ అంటే అంతులేని అభిమానం. మరి కరోనా సమయంలో నితిన్ పెళ్లికి పవన్ హాజరవుతారో.. లేదోనని అంతా భావించారు. కానీ అభిమానిని ఏమాత్రం డిజప్పాయింట్ చేయకుండా శుక్రవారం పవన్.. నితిన్ నివాసంలో ప్రత్యక్షమై సర్‌ప్రైజ్ చేశారు. అభిమానిని మనసారా దీవించారు. పవన్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత చినబాబు కూడా ఉన్నారు. కాగా.. నితిన్ వివాహం ఆదివారం రాత్రి 8:30 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో జ‌ర‌గ‌నుంది.

More News

తెలంగాణలో తాజాగా 1640 కేసులు..

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి.

కాపు రిజర్వేషన్లపై స్పందించిన పవన్.. కేసీఆర్‌కు సూచన

కాపు కార్పొరేషన్‌కు విడుదల చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి కోరారు.

అది వైసీపీకి దేవుడిచ్చిన వరం.. నేతలు కళ్లు తెరవాలి: పవన్

ఏపీ ప్రభుత్వ పని తీరుతో పాటు పలు విషయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. రాష్ట్రంలోనే తొలిసారిగా..

ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

అదే జరిగితే.. రాష్ట్రం రావణకాష్టం అవుతుంది: పవన్

ప్రజలు ఎదురు తిరగట్లేదు.. ఏమీ మాట్లాడట్లేదు అనుకోవడం పొరపాటేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.