మొట్టమొదటి సారి వ్రాంగ్లర్ జీపులో కనిపించిన పవన్

  • IndiaGlitz, [Sunday,November 08 2020]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొట్టమొదటి సారి తన వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ రూబికాన్ జీపులో కనిపించారు. ఆ జీపు ధర 80 లక్షలు రూపాయలు కావడం విశేషం. ప్రస్తుతం పవన్ ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా హైదరాబాద్ మెట్రో ట్రైన్ స్టేషన్ వద్ద షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ షూటింగ్‌లో భాగంగా పవన్ తన రెడ్ కలర్ వ్రాంగ్లర్ జీపులో కనిపించి సందడి చేశారు.

‘వకీల్ సాబ్’ షూటింగ్ కోసం ఇటీవల మెట్రోలో ప్రయాణించడం ఆసక్తికరంగా మారింది. మెట్రో సిబ్బంది సహా ప్రయాణికులంతా ఒక్కసారిగా మెట్రో స్టేషన్‌లో పవన్‌ను చూసి షాక్ అయ్యారు. పవన్ అందరినీ విష్ చేస్తూ వెళ్లి మెట్రో ట్రైన్ ఎక్కారు. ట్రైన్‌లో పలువురు ప్రయాణికులతో ముచ్చటించారు. మెట్రో నుంచి హైదరాబాద్ అందాలను పరిశీలిస్తూ ఖుషీ అయ్యారు. పవన్‌తో పాటు దిల్ రాజు కూడా మెట్రోలో ప్రయాణించారు. ఈ క్రమంలోనే మెట్రోలో పవన్ ప్రయాణించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా.. కరోనా కారణంగా భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ‘వకీల్ సాబ్’ షూటింగ్‌ను చిత్రబృందం నిర్వహిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి ముందు వరకూ గుబురు గడ్డంతో కనిపించిన పవన్.. ప్రస్తుతం మాత్రం హెయిర్ స్టైల్ మార్చేసి.. గుబురు గడ్డాన్ని తొలగించి స్మార్ట్ లుక్‌లో కనిపిస్తున్నారు. పవన్ లుక్ చూసి అభిమానులు బాగా ఖుషీ అవుతున్నారు.

More News

ఫ్యామిలీతో అమెరికా బయలుదేరిన మహేశ్‌

ఈరోజు ఉదయం సూపర్‌స్టార్‌ మహేశ్‌ తన కుటుంబం(నమ్రత, గౌతమ్‌, సితార) సహా అమెరికా బయలుదేరారు. ఎయిర్‌పోర్టులో మహేశ్‌ ఫ్యామిలీతో ఉన్న ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సుమ.. అసలు నిజమిదే..!

బిగ్‌బాస్ సీజన్ 4 ఆదివారం రిలీజ్ చేసిన ప్రోమో చూసి అంతా షాక్ అయ్యారు. యాంకర్ సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నారంటూ ప్రోమోలో చూపించారు.

జారిన ప్యాంటు.. ఆగిన పెళ్లి..

పెళ్లికి బంధువులనందరినీ పిలుచుకున్నారు. వైభవంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. వధువు మెడలో పూల మాల వేసే సమయంలో డామిట్ కథ అడ్డం తిరిగింది. వధువు మెడలో పూలమాల వేసే సమయంలో వరుడి ప్యాంటు జారింది..

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో మరో వ్యక్తి ఆత్మహత్య

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. కుషాయిగూడలో చెట్టుకు ఉరేసుకుని నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

డిసెంబ‌ర్‌లో ప‌వ‌న్‌తో శ్రుతి..!

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. బోనీక‌పూర్‌, దిల్‌రాజు నిర్మాత‌లు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ షెడ్యూల్‌లో ప‌వ‌న్‌, ఇత‌ర