పవన్ యాక్షన్‌లోకి దిగాడు..

  • IndiaGlitz, [Friday,April 02 2021]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో పిరియాడిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 14వ శతాబ్దంలోని మొఘల్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన ఓ వీరుడి కథగా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు సమాచారం. పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో శరవేగంగా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ పవన్ అభిమానులకు ఎంత కిక్ ఇస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వీరమల్లుగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ పాత్ర ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండబోతోందో ఇప్పటికే క్రిష్.. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్‌ ద్వారా చూపించేశారు. తాజాగా మరికొన్ని పిక్స్ అభిమానుల కోసం చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ యాక్షన్ సన్నివేశాల కోసం కోచ్ సాయంతో ప్రాక్టిస్ చేస్తున్నట్టుగా పిక్స్‌లో కనిపిస్తోంది. వీరమల్లు సినిమా కోసం ఆయన ఏ స్థాయిలో ప్రాక్టీస్ అవుతున్నారో ఈ పిక్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ కీలక పాత్రలో కనిపిచబోతున్నారు.

ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఆ కాలానికి తగ్గట్టుగా కనిపించేందుకు పవన్ కల్యాణ్ గెటప్.. ఆయన కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పిరియాడిక్ మూవీలో పవన్ నటించడం ఇదే తొలిసారి కావడంతో పాటు పవన్ ఒక దొంగగా నటించడం కూడా ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ఈ సినిమా 2022 సంక్రాంతిని టార్గెట్ చేస్తుండగా.. పవన్ తాజాగా నటించిన రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More News

పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పవన్ 15 సినిమాలు..

సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలంటే బీభత్సమైన టాలెంట్‌తో పాటు.. కాస్తంత అదృష్టం కూడా ఉండాలి.

‘ఆర్ఆర్ఆర్’ సర్‌ప్రైజ్.. ఓ రేంజ్‌లో ఉంది..

దర్శకధీరుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.

పట్టపగలే నడిరోడ్డుపై వేట కొడవళ్లతో నరికి..

బుల్లెట్‌పై వెళ్తున్న ఓ రౌడీషీటర్‌ను ప్రత్యర్థులు ఆటోలో వెంబడించి పట్టపగలు కత్తులతో పొడిచి చంపారు.

నాగ్‌కి అద్భుతంగా వండి వడ్డించిన మెగాస్టార్..

మెగాస్టార్‌ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఎంత మంచి స్నేహితులనేది అందరికీ తెలిసిందే. ఒకప్పుడు బిజినెస్ పార్ట్‌నర్స్‌గా ఉన్న వీరిద్దరూ..

తమిళనాడులో బీజేపీకి గడ్డు కాలం.. ప్రచారానికి సైతం నో అంటున్న అన్నాడీఎంకే!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిన అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు.