జ‌న‌వ‌రిలో ప్లాన్ చేస్తున్న ప‌వ‌న్‌..!

  • IndiaGlitz, [Thursday,October 08 2020]

ఇంత‌కూ జ‌న‌వ‌రిలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏం ప్లాన్ చేస్తున్నారు? అనే సందేహం క‌లుగ‌క‌మాన‌దు. వివ‌రాల్లోకెళ్తే.. ప‌వ‌న్ రీ ఎంట్రీ త‌ర్వాత చేస్తున్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. త్వ‌ర‌లోనే సినిమా రీస్టార్ట్ కానుంది. ఈ సినిమాను నవంబ‌ర్‌లోపు పూర్తి చేసేయాల‌ని అందుకు త‌గిన‌ట్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ డేట్స్‌ను కేటాయించేశార‌ట‌. దీని త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల్సి ఉంది. కానీ, మ‌రోవైపు క్రిష్ లేటెస్ట్ మూవీ ఇంకా మేకింగ్ ద‌శ‌లోనే ఉంది. ఇది పూర్తి కావ‌డానికి స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. దీంతో ప‌వ‌న్ మ‌రో రీమేక్‌ను జ‌న‌వ‌రిలోనే స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ని స‌మాచారం.

మ‌రి జ‌న‌వ‌రిలో ప‌వ‌న్ స్టార్ట్ చేయ‌బోయే రీమేక్ ఏద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్‌’. ప‌రిమిత సంఖ్య‌లోని క్రూతో ప‌వ‌న్ ఈ సినిమాను స్టార్ట్ చేయాల‌ని భావిస్తున్నారు. ఈ విష‌యాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తోనూ చ‌ర్చించార‌ట‌. త్వ‌ర‌గా డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది ఫైన‌లైజ్ చేయాల‌ని సూచించార‌ట‌. ఈ చిత్రంలో మ‌రో పాత్ర‌లో రానా న‌టిస్తారా లేక త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి న‌టిస్తారా అనేది కూడా ఇంకా ఖ‌రారు కాలేదు. మ‌రి నిర్మాత‌లు ఎలా ముందుకెళ్లాల‌ని త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నార‌ట‌.

More News

మురళీధరన్ బయోపిక్‌లో విజ‌య్ సేతుప‌తి

ఇండియ‌న్ సినిమాలో బ‌యోపిక్స్ హ‌వా న‌డుస్తోంది.

‘ఆర్ఆర్ఆర్‌’లో ఆలియా జాయిన్ అయ్యేదెప్పుడంటే...?

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ ...రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’

అసలు చర్చ వీడి.. ఈగ గురించి రచ్చ స్టార్ట్..

అది అమెరికాలోని ఊటా రాష్ట్రం.. ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య వాడివేడి చర్చ.. చిన్న చీమ కూడా దూరేందుకు వీలు లేని ఫ్లెక్సీ గ్లాస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో..

ట్రోలర్స్‌పై మండిపడిన మంచు లక్ష్మి..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

షాకిచ్చిన ఛానెల్‌కు.. దిమ్మతిరిగేలా ‘నిశ్శబ్దం’ టీమ్ నోటీసులు

హైదరాబాద్‌కు చెందిన ఓ లోకల్ ఛానెల్ ‘నిశ్శబ్దం’ టీంకు షాకిస్తే.. వెంటనే రియాక్ట్ అయిన టీం.. ఛానల్‌కు దిమ్మ తిరిగేలా నోటీసులు పంపించింది.