పవన్ రీమేక్ కన్ ఫర్మ్ అయినట్టే

  • IndiaGlitz, [Wednesday,November 29 2017]

తెలుగులో రీమేక్ కథలంటే ఇష్టపడే హీరోల్లో ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన కెరీర్లో చేసిన రీమేక్ సినిమాల‌న్నీ దాదాపు హిట్ అనే చెప్పాలి.

తమిళంలో అజిత్ కి ఘ‌న‌విజ‌యాన్ని అందించిన వేదాళం' సినిమాని.. పవన్ రీమేక్ చేయ‌బోతున్నారంటూ ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి' సినిమా కారణంగా ఆ రీమేక్‌ పట్టాలెక్కలేదు. ఇప్పుడు అజ్ఞాతవాసి' మూవీ తుది ద‌శ‌కు చేరుకోవ‌డంతో.. మళ్ళీ వేదాళం' రీమేక్ ఓ హాట్ టాపిక్ అయింది.

తాజా సమాచారం ప్రకారం.. ముందనుకున్నట్టుగానే ఎ.ఎం.రత్నం ఈ సినిమాని నిర్మించనున్నారు. తాజాగా..ఎ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ స్వయంగా ఈ విషయం వెల్లడించారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 2018 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఆర్.టి.నేసన్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుస్తాయి.

ఇదిలా ఉంటే.. గోపీచంద్ హీరోగా జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన ఆక్సిజన్' సినిమా రేపు విడుదల కానుంది.

More News

జనవరిలో రానున్న 'రంగస్థలం' ఫస్ట్ లుక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రంగస్థలం 1985’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తోంది. యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూరుస్తున్నారు.

నాగ శౌర్య కథానాయకునిగా మన్యం ప్రొడక్షన్స్ నూతన చిత్రం ప్రారంభం

యువ కథానాయకుడు నాగ శౌర్య నూతన చిత్రం నేడు (29-11-17) ఉదయం 10 గంటల 34 నిమిషాలకు సంస్థ కార్యాలయం లో ప్రారంభ మయింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్ నిచ్చారు.

రామ్-త్రినాథ‌రావు-దిల్ రాజు కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం

ఈ ఏడాది ఇప్ప‌టికే ఐదు సినిమాల స‌క్సెస్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద నిర్మాత‌గా ..త‌న సెల‌క్ష‌న్ ఆఫ్ మూవీస్ గురించి చెప్ప‌క‌నే చెప్పిన దిల్‌రాజు..ఇదే ఏడాది విడుద‌ల కానున్న 'ఎం.సి.ఎ' చిత్రంతో డ‌బుల్ హ్యాట్రిక్‌ను సాధించ‌నున్నారు.

మ‌హేష్ సినిమా అప్‌డేట్స్‌...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'భ‌ర‌త్ అను నేను'(రిజిష్ట‌ర్డ్ టైటిల్‌). డివివి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుద‌ల చేస్తున్నారు.

వివ‌ర‌ణ ఇచ్చుకున్న త్రిష‌...

చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న త్రిష‌..విక్ర‌మ్‌, హ‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న 'సామి స్క్వేర్' లో నుండి త‌ప్ప‌కుంది.  అస‌లు త్రిష ఎందుకు త‌ప్పుకుంద‌నే దానిపై త్రిష త‌న పాత్ర‌కు త‌గ్గ ప్రాధాన్యత సీక్వెల్‌లో లేద‌ని తెలియ‌డంతో త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం.