న్యూలుక్‌తో అభిమానులను మెస్మరైజ్ చేస్తున్న పవన్

  • IndiaGlitz, [Wednesday,March 10 2021]

దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. అటు రాజకీయాలను.. ఇటు సినిమా షూటింగ్‌లనూ ఏకకాలంలో సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ‘వకీల్‌ సాబ్‌’ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏకకాలంలో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘క్రిష్’ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే టాక్ ఆఫ్ ది టైన్‌గా మారింది. ఈ చిత్రంలో వజ్రాల దొంగగా పవన్ నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా పవన్ లుక్ అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. పవన్ న్యూ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లీన్‌ షేవ్‌తో స్లిమ్‌గా పవన్ కనిపిస్తుండటం విశేషం. మునుపటి పవర్‌ స్టార్‌ల పనవ్ అభిమానులకు కనిపించడంతో అంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. ఈ ఫొటోలో ప‌వ‌న్‌ బ్లాక్ ట్రౌజ‌ర్‌-టీ ష‌ర్ట్‌తో న‌డుముపై చేతులు పెట్టుకుని చిరున‌వ్వులు చిందిస్తూ కనిపించాడు. ఇలా స్టైలిష్‌ లుక్‌‌లో వపన్‌ను‌ చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ‘పవర్‌ స్టార్‌ ఈజ్‌ బ్యాక్’‌ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. మూడేళ్ల పాటు పవన్ సినిమాలకు దూరమవడంతో ఆయన ఆ సమయంలో ఫిజిక్‌పై కూడా పెద్దగా దృష్టి సారించలేదు. ఇప్పుడు ఈ లుక్ మాత్రం అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.

ప్ర‌స్తుతం పవన్‌ క్రిష్ డైరెక్ష‌న్‌లో, హ‌రీష్‌శంక‌ర్‌, సాగ‌ర్ చంద్ర డైరెక్ష‌న్‌లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. పవన్ సినిమాలకు అభిమానులు దూరమై మూడేళ్లు అవుతున్నందున.. ఆయన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘వకీల్ సాబ్’ ద్వారా అభిమానులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నిజానికి 2020లోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ జరగలేదు. దీంతో లాక్‌డైన్ అనంతరం ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ పూర్తైంది. ఈ క్రమంలోనే ‘వకీల్ సాబ్’ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

శశికళ అందుకే వెనక్కితగ్గారా? తమిళనాట రసవత్తరంగా రాజకీయం

ఇటీవల కాలంలో తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆది నుంచి సీఎం అభ్యర్థిగా ఉండాలని భావించిన శశికళ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

‘కేజీఎఫ్’ హీరో యశ్ తల్లిపై గొడవకు దిగిన గ్రామస్తులు

‘కేజీఎఫ్’ హీరో.. కన్నడ స్టార్ యశ్ తల్లిపై ఆమె సొంత గ్రామస్తులంతా గొడవకు దిగారు. యశ్ తల్లి తమ పొలం నుంచి ఉన్న దారిని మూసివేయడంతో ఆ గ్రామానికి చెందిన రైతులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు

చిరుకి డీహైడ్రేషన్.. అర్థాంతరంగా నిలిచిపోయిన షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం చిరు ఖమ్మంలో ఉన్నారు.

నాకు సిగ్గేసింది నీ మెచ్యూరిటీ చేసి: అల్లు అర్జున్

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా వరస విజయాలతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా దూసుకుపోతున్న బన్నీ వాసు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా చావు కబురు చల్లగా. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది.

గో సంరక్షుడు, గాయకుడు పెంచల్ దాస్‌ను సన్మానించిన పవన్

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామానికి చెందిన గో సంరక్షుడు చాంద్ బాషాను మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో స్వయంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సన్మానించారు.