ప‌వ‌న్ ఖుషీ సీక్వెల్ మొద‌లైంది

  • IndiaGlitz, [Monday,March 14 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - ఎస్.జె.సూర్య కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ఖుషీ. ఈ చిత్రం యూత్ లో ప‌వ‌న్ కి మ‌రింత క్రేజ్ తీసుకువ‌చ్చింది. ఈ సినిమా త‌ర్వాత ఎస్.జె.సూర్య‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ల‌సి పులి సినిమా చేసారు. కానీ..ఈ సినిమా అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఆత‌ర్వాత మ‌ళ్లీ ప‌వ‌న్ - సూర్య క‌ల‌సి సినిమా చేయ‌నున్నార‌నే వార్త‌లు గ‌త కొన్నిరోజులుగా వ‌స్తున్నాయి.

అయితే స‌ర్ధార్ త‌ర్వాత ప‌వ‌న్ తో సినిమా చేస్తున్నాని దాస‌రి గ‌తంలో ప్ర‌క‌టించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ద‌ర్శ‌కుడు ఎవ‌రనే విష‌యం పై క్లారిటీ రాలేదు. ఓ వైపు దాస‌రి ప‌వ‌న్ తో సినిమా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం...మ‌రో వైపు ఎస్.జె.సూర్య కూడా ప‌వ‌న్ నెక్ట్స్ మూవీని నేనే చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌డంతో స‌ర్ధార్ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ ఎవ‌రితో సినిమా చేస్తాడ‌నేది ఆస‌క్తిగా మారింది.

ఇదిలా ఉంటే...ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో తెర‌కెక్కించ‌నున్న సినిమా కోసం ఎస్.జె.సూర్య అప్పుడే ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేసేసారు. ఈ సినిమా కోసం ముంబైయిలో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసారు. గీత ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...ఖుషీ వ‌ర్కింగ్ విత్ ఎస్.జె సూర్య గారు, అనూప్ డార్లింగ్ అంటూ క‌థార‌చ‌యిత ఆకుల శివ‌, అనూప్ రూబెన్స్, ఎస్.జె.సూర్య ల‌తో రామ‌జోగ‌య్య తీసుకున్న సెల్పీని పోస్ట్ చేసారు. ఈమ‌ధ్య డైరెక్ట‌ర్ ఎస్.జె.సూర్య రేణు దేశాయ్ ని క‌లిసారు. ఈ సినిమా గురించి చ‌ర్చించ‌డానికే సూర్య - రేణుదేశాయ్ ని క‌లిసార‌ని...ఈ సినిమాకి రేణుదేశాయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ ముంబాయిలో ఏర్పాటు చేయ‌డం చూస్తుంటే రేణు దేశాయ్ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న వార్త నిజమేనేమే అనిపిస్తుంది.

More News

బాలీవుడ్ లో స‌ర్ధార్ సెన్సేష‌న్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ సినిమా గురించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో రోజురోజుకి అంచ‌నాలు పెరిగిపోతున్నాయి.

బుల్లెట్ రాణి నాకొక బిగ్ ఛాలెంజ్ : నిషా కొఠారి

ఇప్పటివరకు తాను చేసిన క్యారెక్టర్స్ అన్నిటిలో "బుల్లెట్ రాణి" లో చేసిన ఇన్స్ పెక్టర్ రాణి  పాత్ర తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, ఈ క్యారెక్టర్ ను ఓ ఛాలెంజ్ గా తీసుకొని చేసానని "బుల్లెట్ రాణి" కథానాయకి నిషా కొఠారి పేర్కొంది.

వి.వి.వినాయక్ చేతుల మీదుగా ప్రేమికుడు ఆడియో రిలీజ్..

మానస్.ఎన్,సనమ్ శెట్టి జంటగా కళా సందీప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ప్రేమికుడు.

అల్లరి నరేష్ చేతుల మీదుగా రన్ ఆడియో రిలీజ్...

సందీప్ కిషన్,అనీషా అంబ్రోస్ జంటగా మిస్టర్ నూకయ్య ఫేం అని కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం రన్.ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర సమర్పణలో సుధాకర్ చెరుకూరి,కిషోర్ గరికపాటి,అజయ్ సుంకర సంయుక్తంగా నిర్మించారు.

గోపీచంద్ వద్దన్నాడు..బన్ని చేస్తున్నాడు

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఇప్పుడు సరైనోడు చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. బొలివియాలో షూటింగ్ కూడా ముగిసింది. సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.