అప్పుడు మద్దతిచ్చి .. ఇప్పుడు తరలిస్తామంటే చూస్తూ ఊరుకొం : పవన్

సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకు పడ్డారు జనసేనా అధినేత పవన్ కళ్యాణ్. అమరావతిని తరలించేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తోందని.... కానీ అది సాధ్యం కాదని స్పష్టం చేశారు.

ఇప్పటికైనా ఆ ప్రయత్నం విరమించుకోవాలని హితవు పలికారు. రాజధాని రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అమరావతిని తరలించాలని చూస్తే ఆందోళనలు తప్పవన్నారు. మెజార్టీ ఉందని ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోబోమన్నారు పవన్. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం సమంజసం కాదన్న పవన్... అప్పుడు అమరావతికి ఆమోదం తెలిపి ... ఇప్పుడు అమరావతి తరలిస్తామని చెప్పడం సమంజసం కాదన్నారు. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు... భూసేకరణ, భూ సమీకరణకు మీరు మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నించారు పవన్.