మహేష్ బ్యానర్లో పవన్ సినిమా..

  • IndiaGlitz, [Sunday,December 06 2015]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్యాన‌ర్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్నాడ‌ట‌. ఇంత‌కీ మ‌హేష్ బ్యాన‌ర్ ఏమిట‌నుకుంటున్నారా...? మ‌హేష్ బాబుకి శ్రీమంతుడు అనే బ్లాక్ బ‌ష్టర్ అందించిన మైత్రీ మూవీ మేక‌ర్స్. ప్ర‌స్తుతం మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో జ‌న‌తా గ్యారేజ్ మూవీని నిర్మిస్తుంది. శ్రీమంతుడు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలోనే మైత్రీ మూవీ మేక‌ర్స్ జ‌న‌తా గ్యారేజ్ నిర్మిస్తుండ‌డం విశేషం.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే....మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాట‌ర‌.ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ నితిన్ తో అ..ఆ మూవీ చేస్తున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ మూవీ చేస్తున్నాడు. వీరిద్ద‌రి క‌మిట్ మెంట్స్ పూర్త‌యిన త‌ర్వాత ఈ సినిమా చేసే అవ‌కాశం ఉంది. మ‌రి..ప‌వ‌న్ ఎప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారో..?

ఎప్పుడు ప్రారంభిస్తారో చూడాలి.