ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న పవన్ టార్గెట్..

  • IndiaGlitz, [Saturday,February 27 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ సినిమాని అనుకున్న విధంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేయ‌డానికి ప‌వ‌న్ 3 యూనిట్లుతో షూటింగ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం స‌ర్ధార్ రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

అయితే ప‌వ‌న్ టార్గెట్ అంటూ నెట్ లో వ‌స్తున్న వార్త‌లు ఫ్యాన్స్ ని టెన్ష‌న్ పెడుతున్నాయి. ఇంత‌కీ ఆ వార్త‌ల సారాంశం ఏమిటంటే...ప‌వ‌న్ వంద కోట్లు సంపాదించ‌డం టార్గెట్ గా పెట్టుకున్నార‌ట‌. ఎందుకంటే వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ పోటీ చేయ‌డం కోసం వంద కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నాడు. అందుచేత ఈలోపు వీలైన‌న్ని ఎక్కువ సినిమాలు చేయాల‌నుకుంటున్నాడు. 2018 సంక్రాంతికి ప‌వ‌న్ ఆఖ‌రి సినిమా రిలీజ్ అవుతుంది అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ వార్త‌ల్లో వాస్త‌వం ఉందో లేదో కానీ... అప్పుడే ప‌వ‌న్ ఏక్టింగ్కి ఫుల్ స్టాఫ్ పెట్టేస్తారా..? అంటూ ప‌వ‌న్ ఫ్యాన్స్ తెగ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. మ‌రి..ఈ వార్త‌ల గురించి ప‌వ‌న్ స‌ర్ధార్ ఆడియో వేడుక‌లో స్పందిస్తాడేమో చూడాలి.