ప్రభుత్వానికి పవన్ డిమాండ్స్ ఇవే..!

  • IndiaGlitz, [Wednesday,January 04 2017]

శ్రీకాకుళంలో జిల్లాలో కిడ్నీ వ్యాధి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. క‌నీసం ఎందుకు ఇలా జ‌రుగుతుందో కార‌ణాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డం లేదు అంటూ జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆవేద‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించాలి అంటూ ప్ర‌భుత్వం ముందు కొన్ని డిమాండ్స్ పెట్టారు.
ఇంత‌కీ ప‌వ‌న్ డిమాండ్స్ ఏమిటంటే....శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధితో బాధ‌ప‌డుతున్నవ్య‌క్తితో పాటు అత‌నితో క‌లిసి ప్ర‌యాణించే వ్య‌క్తికి ఫ్రీ బ‌స్ పాస్ సౌక‌ర్యం క‌ల్పించాలి. కిడ్నీ బాధితుల కుటుంబాల‌కు పున‌రావాస సౌక‌ర్యం క‌ల్పించాలి. డ‌బ్ల్యూఓ స్టాండ‌ర్ట్స్ తో ఉండే వాట‌ర్ ను అందించాలి. ప్ర‌తి మండ‌లంలో ఖ‌చ్చితంగా వీలైనంత త్వ‌ర‌గా డ‌యాలిసిస్ సెంట‌ర్ ప్రారంభించాలి. నెప్రాల‌జిస్ట్ ను అందుబాటులో ఉంచాలి అని తెలియ‌చేసారు. అలాగే ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు జ‌న‌సేన కోర్ టీమ్ వ‌ర్క్ చేస్తున్న‌ట్టు తెలిపారు.