పాట పూర్తి చేసిన ప‌వ‌న్‌

  • IndiaGlitz, [Friday,December 22 2017]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఓ మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌థానాయ‌కుడిగానే ప‌రిమితం కాకుండా ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం, గానం.. ఇలా ప‌లు విభాగాల్లో ప‌వ‌న్ రాణించారు. ప‌వ‌న్ పాడిన పాట‌లన్నీ కూడా క్లిక్ అయ్యాయి. ఇక త‌న 25వ చిత్రం అజ్ఞాత‌వాసిలోనూ ఓ పాట పాడారు ప‌వ‌న్‌.

ఈ విష‌యంపై గ‌తంలో ప‌లు వార్త‌లు వినిపించినా.. గురువారం ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తెలియ‌జేశారు ఆయ‌న‌. ''అజ్ఞాత‌వాసి కోసం ఇప్పుడే ఓ పాటని పాడ‌డం పూర్తి చేశాను'' అంటూ చిత్ర ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ కాంబినేష‌న్‌లో దిగిన ఫొటోని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

ఈ పాట నూత‌న సంవ‌త్స‌రం కానుక‌గా విడుద‌ల కాబోతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అత్తారింటికి దారేది వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో అజ్ఞాత‌వాసిపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ఈ సినిమా విడుద‌ల కానుంది.

More News

'హలో' చూశాక.. చాలా చాలా తృప్తిగా, చాలా సంతోషంగా వుంది - నిర్మాత అక్కినేని నాగార్జున

యూత్ కింగ్ అఖిల్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా'మనం' ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో

వృద్ధాశ్రమం కోసం రెడ్ ఎఫ్ ఎం స్ప్రెడ్ స్మైల్ కార్యక్రమంలో పాల్గొన్న ఛలో మూవీ యూనిట్

ప్రముఖ ఎఫ్ ఎం రేడియో రెడ్ ఎఫ్ ఎం ప్రతి ఏటా స్ప్రెడ్ స్మైల్ పేరుతో వృద్దాశ్రమం లోని వృద్ధుల్ని ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

'ఒక్క క్షణం' సెన్సార్ పూర్తి

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి జంట‌గా, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో , క్వాలిటి కోస‌మే ప‌రిత‌పించే లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ పై చక్రి చిగురుపాటి నిర్మించిన  చిత్రం ఒక్

వెంకటేష్.. రెండు రోజులు

విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రల్లో కనిపించిన సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు.

'అనసూయ' కి 10 ఏళ్లు

హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో రాణించిన కథానాయికల్లో భూమికా చావ్లా ఒకరు.