close
Choose your channels

అదే జరిగితే.. రాష్ట్రం రావణకాష్టం అవుతుంది: పవన్

Friday, July 24, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అదే జరిగితే.. రాష్ట్రం రావణకాష్టం అవుతుంది: పవన్

ప్రజలు ఎదురు తిరగట్లేదు.. ఏమీ మాట్లాడట్లేదు అనుకోవడం పొరపాటేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 60కి పైగా కేసుల్లో కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం పట్ల ఆయన స్పందించారు. పోలీస్, రెవెన్యూ తదితర యంత్రాగమంతా ప్రభుత్వం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలకడం సరికాదన్నారు. కోర్టులకు స్వయం ప్రతిపత్తి ఉండటంతో కాస్త ప్రజలకు న్యాయం జరుగుతోందన్నారు. ఇంకా పవన్ మాట్లాడుతూ.. ‘‘పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి కొమ్ము కాస్తే ఎలా ఉంటుందో అగ్రరాజ్యమైనా అమెరికాలోనే మనం చూశాం. పోలీసు వ్యవస్థే ఉండకూడదన్నంత కోపం అక్కడి ప్రజల్లో వచ్చేసింది.

అలాంటి పరిస్థితే ఇక్కడా రాకూడదని ఏముంది? ప్రభుత్వం ఎవరూ మనకు ఎదురు తిరగరు అనుకోవడం పొరపాటు. క్షేత్ర స్థాయిలో చిన్న మార్పు వస్తే.. అది రావణ కాష్టంలా రాష్ట్రమంతా అంటుకుంటుంది. డీజీపీ వచ్చి మాట్లాడాలి అని కోర్టు అనే వరకూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులకు ఆయన బలై పోతున్నారు. ఈ విషయంలో అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి శిరోముండనం చేయించడం.. వంటి వాటన్నింటికీ చాలా తీవ్ర పరిణామాలుంటాయి. డాక్టర్ సుధాకర్ గారి విషయంలో కూడా అలాగే ప్రవర్తించారు. ఆయనను పెట్టిన హింస.. ప్రజా ప్రతినిధులకు క్షేమం కాదు’’ అని పవన్ పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment