సూర్యని మార్చేసిన పవన్..

  • IndiaGlitz, [Sunday,June 19 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్నిప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు.ఈ మూవీ షూటింగ్ ని త్వ‌ర‌లో ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...స‌డ‌న్ గా ఈ మూవీ డైరెక్ట‌ర్ సూర్య‌ని ప‌వ‌న్ మార్చేసాడు. ఎస్.జె.సూర్య ప్లేస్ లో డాలీ వ‌చ్చాడు. గ‌తంలో డాలీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో గోపాల గోపాల మూవీ తెర‌కెక్కించాడు. డాలీ వ‌ర్కింగ్ స్టైల్ న‌చ్చ‌డంతో మ‌రో అవ‌కాశం ఇస్తాన‌ని ప‌వ‌న్ మాట ఇచ్చాడు. ప‌వ‌న్ తో దాస‌రి నిర్మించే చిత్రానికి డాలీ డైరెక్ట‌ర్ అంటూ ప్ర‌చారం జ‌రిగింది. కానీ...దాస‌రి నిర్మించే సినిమా క‌న్నా ముందే ప‌వ‌న్ ని మ‌రోసారి డైరెక్ట్ చేసే అవ‌కాశం ద‌క్కించుకున్నాడు డాలీ.
ఇంత‌కీ ఎస్.జె.సూర్య ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నాడు అంటే....ఎస్.జె.సూర్య ఇరైవి అనే త‌మిళ చిత్రంలో న‌టించారు. ఈ చిత్రంలో సూర్య అద్భుతంగా న‌టించ‌డంతో అటు త‌మిళ్, ఇటు తెలుగులో ఎస్.జె.సూర్య వ‌రుస‌గా అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్నాడు. మ‌హేష్, మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రంలో ఎస్.జె.సూర్య విల‌న్ గా న‌టిస్తున్నారు. దీంతో అటు న‌టుడుగా, ఇటు డైరెక్ట‌ర్ గా ఒకే టైమ్ లో వ‌ర్క్ చేయాల్సి రావ‌డంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ప‌వ‌న్ - డాలీ మూవీని జులై నెలాఖ‌రున ప్రారంభించ‌నున్నారు.