హోస్టన్‌లో పవన్ బర్త్‌డే‌ను గ్రాండ్‌గా నిర్వహించిన అభిమానులు

  • IndiaGlitz, [Monday,August 31 2020]

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించారు. హోస్టన్‌కి చెందిన పవన్ అభిమానులు, అనుచరులంతా ఒకచోట చేరి ఈ వేడుకలను నిర్వహించారు. హోస్టన్ నుంచి వచ్చిన ‘రేడియో హంగామా’ టీం పవన్ కల్యాణ్‌పై ప్రత్యక్ష గో ఎయిర్ ప్రోగ్రాం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రపంచం నలుమూలల్లో ఉన్న పవన్ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌లోని రాజోల్‌కు చెందిన ఓ కాలర్.. యూఎస్ లైవ్ ప్రోగ్రామ్‌కు పిలుపునివ్వడమే కాకుండా పవర్‌స్టార్‌కు తన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పిలుపు మేరకు పవన్ అభిమానులు, అనుచరులు ఈ లైవ్ ప్రోగ్రాంలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ ప్రోగ్రాం పవన్ హిట్ సాంగ్స్‌‌ను ఆయన అభిమానులు బాగా ఎంజాయ్ చేశారు.

ఈ సందర్భంగా కొందరు జనసైనికులు హోస్టన్‌లోని డౌన్ టౌన్‌కు వెళ్లి చాలా మంది నిరాశ్రయులకు పండ్లు, బ్రెడ్, పానీయాలు, నీరు, మెక్డొనాల్డ్స్ బర్గర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోపాల్ గుడపతి, రాజేష్ యలబండి, శ్రీధర్ ధాడి, నాగు కునసాని, ఆర్జే ఉషా, అరుణ్ వడేగోరా, సైరాజ్ కోతమాసు, ప్రసాద్ లాలం, నవీన్ నాయుడు, నరేష్ సబాసు, జయకుమార్ తన్నేరు తదితరులు పాల్గొన్నారు.

More News

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తాజా హెల్త్ అప్‌డేట్..

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం ఆయనకు ఆర్మీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే.

నిర్మాత‌గా మారుతున్న కీర్తి..?

కీర్తి సురేశ్‌... ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని ఒక ప‌క్క స్టార్ హీరోల సినిమాల‌తో

పవన్ అభిమానులకు ట్రీట్ ప‌క్కా!!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సెప్టెంబ‌ర్ 2. ప‌వ‌న్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఇప్ప‌టికే రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు.

‘వైల్డ్ డాగ్‌’ను షురూ చేసిన నాగార్జున‌

నాగార్జున లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్‌’ షూటింగ్ షురూ అయ్యింది. అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో