ప‌వ‌న్ ప్లాన్ (ఆడియో రిలీజ్ టు సినిమా రిలీజ్)

  • IndiaGlitz, [Thursday,March 24 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా అనుకున్న డేట్ కి రిలీజ్ చేయ‌డం కోసం డే అండ్ నైట్ హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు. ఈనెల 20న స‌ర్ధార్ ఆడియో రిలీజ్ చేసారు. ఏప్రిల్ 8 సినిమా రిలీజ్ ని ఎనౌన్స్ చేసారు. కానీ..ఇంకా రెండు పాట‌లు చిత్రీక‌రించాలి. త‌క్కువ టైంలోనే రెండు పాట‌లు చిత్రీక‌రించాలి. ఎడిటింగ్ చేయాలి..సెన్సార్ పూర్తి చేయాలి...ఇలా చాలా వ‌ర్క్ ఉంది. అయితే ప‌వ‌న్ మొండోడు. అనుకున్నానంటే జ‌రిగి తీరాల్సిందే అంటాడు.

ఇంత‌కీ సినిమా రిలీజ్ కి ప‌వ‌న్ ప్లాన్ ఏమిటంటే...ఆడియో రిలీజ్ నెక్ట్స్ డే స‌ర్ధార్ టీమ్ రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ కోసం స్విట్జార్లాండ్ వెళ్లారు. ఆరు రోజుల్లోనే రెండు పాట‌లు చిత్రీక‌రించాలి అని ప్లాన్. అంటే ఈనెల 27కి రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ పూర్తి చేయాల‌ని టార్గెట్. ఆత‌ర్వాత ఈనెల 29కి హైద‌రాబాద్ చేరుకుంటారు. టాకీ పార్ట్ అండ్ డ‌బ్బింగ్ పూర్త‌య్యింది. అందుచేత‌ సిటీకి వ‌చ్చిన వెంట‌నే రెండు పాట‌ల ఎడిటింగ్ పూర్తి చేసి సెన్సార్ కి అప్లై చేయాలి. ఏప్రిల్ 1 కుద‌ర‌క‌పోతే ఏప్రిల్ 2న సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేయాలి. ఏప్రిల్ 8న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలి. ఇది ప‌వ‌న్ ప్లాన్.

More News

బ్ర‌హ్మోత్స‌వం కొత్త టీజ‌ర్ వ‌చ్చేస్తుంది

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు.

బాల‌య్య వందో సినిమా ఫిక్స్..

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వందో సినిమా గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. కృష్ణ‌వంశీ - క్రిష్ ఈ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు బాల‌య్య వందో సినిమా డైరెక్ట‌ర్ అని ప్ర‌చారం జ‌రిగింది.

స‌ర్ధార్ మెగా హీరోల‌కు న‌చ్చ‌లేదా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో రిలీజైంది. స‌ర్ధార్ ట్రైల‌ర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ ట్రైల‌ర్ కి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది.

త‌మ‌న్నా కోరిక నెర‌వేరిన‌ట్టే

పేరుకి ఉత్తరాది భామ అయినా.. ద‌క్షిణాది భాష‌లు తెలుగు, త‌మిళంను సైతం అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల నైపుణ్యం హీరోయిన్ త‌మ‌న్నా సొంతం. అయితే అంత బాగా మాట్లాడుతున్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రెండు భాష‌ల్లోనూ డ‌బ్బింగ్ చెప్పుకోలేక‌పోయింది త‌మ‌న్నా. అయితే ఆ లోటు ఈ సంవ‌త్స‌రం తీర‌బోతున్న‌ట్లే. 

నాలుగోసారి ఆమెకి ఛాన్స్ ఇచ్చిన‌ విక్ర‌మ్‌

'మ‌నం' చిత్రంతో తెలుగువారికి బాగా ద‌గ్గ‌రైన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌.. ప్ర‌స్తుతం సూర్య‌తో '24' అనే సైంటిఫిక్ ఫిక్ష‌న్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విక్ర‌మ్‌కి ద‌ర్శ‌కుడిగా ఆర‌వ చిత్రం. ఈ సినిమా కోసం ఓ అంశాన్ని విక్ర‌మ్ నాలుగోసారి రిపీట్ చేస్తున్నాడు.