ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్.. సేమ్ టు సేమ్‌

  • IndiaGlitz, [Thursday,October 26 2017]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి చిత్రం జ‌ల్సా. 2008లో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఖుషి త‌రువాత స‌రైన విజ‌యం లేని ప‌వ‌న్‌కి మ‌ళ్లీ స‌క్సెస్‌ని అందించింది. ఆ సినిమా త‌రువాత మ‌ళ్లీ ఐదేళ్ల త‌రువాత వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా అత్తారింటికి దారేది. 2013లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ.. ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. అలాంటి ఈ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా రానుంది. విశేష‌మేమిటంటే.. అత్తారింటికి దారేది చిత్రం విడుద‌లైన ఐదేళ్ల‌కు అంటే.. 2018లో ఈ సినిమా రానుంది.

మ‌రి.. ఐదేళ్ల‌కో ఓ సారి వ‌స్తున్న ఈ కాంబినేష‌న్‌.. ముచ్చ‌ట‌గా మూడోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి. అన్న‌ట్టు.. జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాల త‌ర‌హాలోనే ఈ సినిమాలో కూడా ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. కీర్తి సురేష్‌, అను ఇమ్మానియేల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీత‌మందిస్తున్నాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుందీ చిత్రం. కాగా.. ఈ సినిమా తాజా షెడ్యూల్ బ‌ల్గేరియాలో జ‌రుగ‌నుంది. ఈ నెల 29న మొద‌ల‌య్యే ఈ షెడ్యూల్ 15 రోజుల పాటు జ‌రుగ‌నుంద‌ని తెలిసింది.

More News

ఆ పార్టీ లోకి కవిత

గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ లో కొనసాగుతున్న కవిత ఇప్పుడు పార్టీ మారనున్నట్లు తెలిసింది.

సోని చరిష్ఠ బర్త్ డే సెలబ్రేషన్స్ @ నేచర్ ఎవెన్యూ !!

యువ కథానాయకి సోని చరిష్ఠ బర్త్ డే వేడుక 'నేచర్ ఎవెన్యూ ఇన్ ఫ్రా'లో ఘనంగా జరిగింది. ప్రముఖ నటుడు లోహిత్, నేచర్ ఎవెన్యూ ఇన్ ఫ్రా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.నరేంద్ర, నేచర్ ఎవెన్యూ డైరెక్టర్స్ వినోద్ రావు, రవికుమార్, సతీష్ లతోపాటు.. నేచర్ ఎవెన్యూ సిబ్బంది ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు. 

అప్పుడు గోపీచంద్‌..ఇప్పుడు నారా రోహిత్‌...

హీరోగా నుండి విల‌న్‌గా మారిన న‌టులు చాలా మంది మ‌న‌కు తెలుగులో క‌న‌ప‌డ‌తారు. ఇప్ప‌టి యువ క‌థానాయ‌కుల్లో హీరో గోపీచంద్‌..ముందు హీరోగా ఎంట్రీ ఇచ్చిన జ‌యం, వ‌ర్షం, నిజం చిత్రాల్లో విల‌న్‌గా న‌టించాడు.

ఏప్రిల్‌ 27న మ‌హేష్ 'భ‌ర‌త్ అను నేను'

సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ప్రొడక్షన్‌ నెం.3గా నిర్మిస్తున్న భారీ చిత్రం షెడ్యూల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

మెలోడీ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో సాయిధ‌ర‌మ్‌?

తొలి ప్రేమ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన ఎ.క‌రుణాక‌ర‌న్‌.. ఆ త‌రువాత వాసు, బాలు, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్షకుల‌కు మ‌రింత చేరువ‌య్యారు.