పోటీ పడుతున్న పవన్, ఎన్టీఆర్...?

  • IndiaGlitz, [Sunday,January 22 2017]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. కాట‌మ‌రాయుడు పూర్తైన త‌ర్వాత అంటే ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా సెట్స్‌లోకి వెళుతుంది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను ఆగ‌స్ట్ 11న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

అలాగే మ‌రోవైపు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న జై ల‌వ‌కుశ చిత్రం కూడా ఆగ‌స్ట్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఈ రెండు చిత్రాల పోటీ మ‌రోసారి నంద‌మూరి, మెగా కుటుంబాల పోరుగా అభిమానుల మ‌ధ్య సెగ‌ను పుట్టించ‌నుంది. జ‌న‌తాగ్యారేజ్ వంటి స‌క్సెస్ త‌ర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా, మ‌రో సైడ్ ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్ కాబ‌ట్టి రెండు సినిమాల‌పై మంచి అంచ‌నాలు నెల‌కొంటాయ‌న‌డంలో సందేహం లేదు.