పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పవన్ 15 సినిమాలు..

  • IndiaGlitz, [Friday,April 02 2021]

సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలంటే బీభత్సమైన టాలెంట్‌తో పాటు.. కాస్తంత అదృష్టం కూడా ఉండాలి. అవకాశాల కోసం ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ చెప్పులరిగే దాకా స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎప్పటికో గానీ వారికి కాలం కలిసి రాదు. కానీ దీనికి పరిష్కారం చూపే దిశగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని.. సక్సెస్ కావాలని తపించే వారికి పవన్.. టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి గొప్ప అవకాశం కల్పించి వారి జీవితాలను మంచి టర్న్ ఇవ్వబోతున్నారు. దీని కోసం ఇప్పటికే రంగం సిద్ధమైంది.

వినూత్న ఆలోచనలు కలిగిన రచయితలను, ఆ విధమైన కథలు చెప్పగలిగే దర్శకులను... బహు భాషల్లో మన కథలను తీసుకువెళ్లగలిగే ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌ను స్థాపించారు. అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న నిర్మాత టి.జి.విశ్వప్రసాద్. ఈ సంస్థ ద్వారా వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ తన సొంత నిర్మాణ సంస్థ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ - పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సంయుక్తంగా 15 సినిమాలను నిర్మిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

కాగా విశ్వప్రసాద్ తన నిర్మాణ సంస్థ ద్వారా అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు సంబంధించి పదికిపైగా చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్ఎల్‌పీ సంస్థలు యంగ్ టాలెంటెడ్‌కు అవకాశం కల్పించేందుకు సిద్ధమయ్యాయి. దీనికోసం ఇప్పటికే ఓ ప్రణాళిక సిద్ధమైంది. యువ ప్రతిభావంతుల స్వచ్ఛమైన ఆలోచనలు... కలలు కార్యరూపం దాల్చే వేదికగా ఇది రూపుదిద్దుకోనుంది. దీనికి హరీష్ పాయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ నిర్మాణ సంస్థల కలయికలో 6 పరిమిత చిన్న తరహా చిత్రాలు... 6 మధ్యతరహా చిత్రాలు... 3 భారీ చిత్రాలు నిర్మించబోతున్నారు. తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారకంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

More News

‘ఆర్ఆర్ఆర్’ సర్‌ప్రైజ్.. ఓ రేంజ్‌లో ఉంది..

దర్శకధీరుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.

పట్టపగలే నడిరోడ్డుపై వేట కొడవళ్లతో నరికి..

బుల్లెట్‌పై వెళ్తున్న ఓ రౌడీషీటర్‌ను ప్రత్యర్థులు ఆటోలో వెంబడించి పట్టపగలు కత్తులతో పొడిచి చంపారు.

నాగ్‌కి అద్భుతంగా వండి వడ్డించిన మెగాస్టార్..

మెగాస్టార్‌ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఎంత మంచి స్నేహితులనేది అందరికీ తెలిసిందే. ఒకప్పుడు బిజినెస్ పార్ట్‌నర్స్‌గా ఉన్న వీరిద్దరూ..

తమిళనాడులో బీజేపీకి గడ్డు కాలం.. ప్రచారానికి సైతం నో అంటున్న అన్నాడీఎంకే!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిన అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు.

వైష్ణ‌వ్ తేజ్ పంజా హీరోగా ఎస్‌.వి.సి.సి ఎల్ఎల్‌పి బ్యాన‌ర్ కొత్త చిత్రం ప్రారంభం

2021లో ‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సెన్సేషనల్ స్టార్ వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాల‌ను