అన్నయ్య అందుకే అలా మారిపోయారు.. పరుచూరి షాకింగ్ లుక్‌‌పై గోపాలకృష్ణ రియాక్షన్

  • IndiaGlitz, [Friday,April 01 2022]

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుతో దర్శకుడు జయంత్ సీ పరాన్జీ దిగిన ఓ ఫోటో ఇటీవల సోషల్ మీడియాలోనూ, తెలుగు చిత్ర పరిశ్రమలను హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలో పరుచూరి బాగా బక్కచిక్కిపోయి.. గుర్తుపట్టకుండా వున్నారు. దీంతో ఆయన ఆరోగ్యంపై రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు సోదరుడు గోపాలకృష్ణ స్పందించారు.

అన్నయ్య చాలా బాగున్నారని... ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన తెలిపారు. 2017లో ఆస్ట్రేలియా వెళ్లి వచ్చిన తర్వాత ఆయనకు స్వల్ప ఆరోగ్య సమస్యలున్నట్లు గుర్తించామని... దానికి తగ్గట్టుగానే ఆహార నియమాలు పాటిస్తున్నారని గోపాలకృష్ణ వెల్లడించారు. దాంతో ఆయన 10 కిలోల వరకూ బరువు తగ్గారని.. అందుకే ఆయన అలా కనిపిస్తున్నారని పరుచూరి చెప్పారు. అన్నయ్య మేథస్సు అలాగే ఉందని.. నేను ఫోన్‌ చేసినప్పుడు ఎంతో చక్కగా మాట్లాడుతున్నారని గోపాలకృష్ణ పేర్కొన్నారు.

జుట్టుకు రంగు వేయకపోయేసరికి అలా ఉన్నారని.. ఆ ఫొటో షేర్‌ చేసిన జయంత్‌ను కూడా, ఎందుకయ్యా అలాంటి ఫొటో పెట్టావు అని అడిగానని గోపాలకృష్ణ పేర్కొన్నారు. చిక్కిపోయాడు, జుట్టుకు రంగేసుకోలేదని ఇలా చాలామంది అంటున్నారని... కానీ ఒక్క వ్యక్తి మాత్రం 80 ఏళ్లు వచ్చాక ఇంకెలా ఉంటాడు? ఎందుకిలా మాట్లాడుతున్నారు? అని సరిగ్గా చెప్పాడని గోపాలకృష్ణ అన్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు అంటే మాస్టర్‌ ఆఫ్‌ స్క్రీన్‌ప్లే అని.. పల్స్‌ ఆఫ్‌ ది ఆడియన్స్‌ తెలిసిన వ్యక్తి అని ప్రశంసించారు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం సహజమని.. ఆ విషయాన్ని గ్రహించి అందరూ ధైర్యంగా ఉండాలి అని గోపాలకృష్ణ సూచించారు.

More News

భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, ఏకంగా రూ.250 పెంపు, కొత్త రేట్లు ఇవే

ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరిచింది కేంద్ర సర్కార్ . దీనిపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలకు సైతం సిద్ధమవుతున్నాయి.

టాలీవుడ్‌లో విషాదం .. క్యాన్సర్‌తో డైరెక్టర్ శరత్ కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో దర్శకుడు శంకర్ కన్నుమూశారు.

500 తల్లిబిడ్డా ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించిన సీఎం జగన్.. బెజవాడలో పరుగులు

విజయవాడలోని బెంజిస‌ర్కిల్ వ‌ద్ద శుక్రవారం త‌ల్లి బిడ్డా ఎక్స్ ప్రెస్ వాహ‌నాల‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు.

ఆర్ఆర్ఆర్ యూనిట్‌పై ఆగ్రహం.. స్పందించిన అలియా, సింగిల్‌ పోస్ట్‌తో అందరికీ ఇచ్చిపడేసిందిగా

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ‘‘ఆర్ఆర్ఆర్’’.

నాగార్జున చేతుల మీదుగా విడులైన సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘గాలివాన’ ట్రైలర్‌

పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ నుండి కామెడీ డ్రామా ‘‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’’ మరియు అన్నపూర్ణ స్టూడియోస్‌ నుండి ‘‘లూజర్‌’’